ఒక గ్రామానికి అయినా.. ఒక మనిషికి అయినా ఏదో ఒక పేరు అనేది ఉంటుంది. అది ఉంటేనే ఆ గ్రామానికి అయినా.. మనిషికి అయినా ఐడెంటిటీ ఉంటుంది. లేదంటే.. ఒక అడ్రస్ లాంటిది ఉండదు. అయితే మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఒక గ్రామానికి చెందిన గ్రామస్తులకు ఎలాంటి పేర్లు లేవు. అదెక్కడో తెలుసా.. మేఘాలయాలోని ఓ గ్రామం.
అక్కడ ఉన్న మనుషుల్లో ఎవరికీ ఎలాంటి పేర్లు లేవు. మరి వాళ్లు కమ్యూటికేట్ ఎలా చేస్తారో అని అందరికీ అనుమానం వస్తుంది. వాళ్లు విజిల్స్ తోనే కమ్యూనికేట్ చేసుకుంటారట. ఆ గ్రామం పేరు కాంగ్థాన్. ఆ గ్రామంలో దాదాపు మొత్తం 700 మంది ఉన్నారు.
మేఘాలయాలోని కాంగ్థాన్ గ్రామం అనేది.. ఈస్ట్ ఖాసి జిల్లాలో ఉంది. ఇక అక్కడ మొదటి నుంచి కూడా ఈల వేయడం అనేది ఒక ఆచారం అట. వాళ్ల పూర్వికుల నుంచి కూడా ఈ ఆచారం అనేది కొనసాగుతూ వస్తోంది. ఆ ఊళ్లోకి ఇక కొత్తవారు వెళ్లారంటే.. ఇక అంతే సంగతులు.. పిచ్చి ఎక్కడమే. ఎవరకి ఏ పేరు పెట్టి పిలవాలో అర్థం కాదు. ఊరు మొత్తం ఈలతోనే మారుమ్రోగుతుంది.
ఆ ఈలలు కూడా ఒకొక్కరికీ ఒక్కో విధంగా పెడతారు. అందులో పక్షుల అరుపులు, సినిమా పాటలోని ట్యూన్లను వాళ్లకు పేర్లు పెట్టి.. ఆ ఈలలతో ఐటెంటిటీ చేస్తుంటారు. అందుకే ఆ గ్రామాన్ని విజిల్ గ్రామం అని కూడా అంటారట. తల్లిదండ్రులకు ఒక ఈల.. కొడుకు, కూతుర్లకు మరో ఈల శబ్ధాలు వినపడుతున్నాయి. మరి వాళ్లకు ఓట్లు.. ఎలా కేటాయించరనేది అర్థం కాని విషయం.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…