ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు, వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. సాఫీగా సాగుతున్న మనుషుల జీవితాన్ని కరోనా వైరస్ అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. అయితే తాజా పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు మరో కీలకమైన విషయాన్ని వెల్లడించారు.
ఓ బ్లడ్ గ్రూప్ రక్తం కలిగి ఉన్న వాళ్లకు మిగతా బ్లడ్ గ్రూపులతో పోల్చి చూస్తే కరోనా ముప్పు తక్కువని చెబుతున్నారు. డెన్మార్క్, కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు వేర్వేరు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనంలో భాగంగా 7,422 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఈ బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలించగా 44 శాతం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకు, 38 శాతం మంది ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకు కరోనా సోకినట్టు వెల్లడైంది.
కెనడాకు చెందిన పరిశోధకులు ఐసీయూలో ఉన్న కరోనా రోగుల గురించి పరిశోధనలు చేసి ఆ పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. ఏ, ఏబీ బ్లడ్ గ్రూపుల వాళ్లలో 84 శాతం మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే మిగిలిన బ్లడ్ గ్రూపులైన బీ, ఓ బ్లడ్ గ్రూపులలో కేవలం 61 శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఫిజీషియన్ మైపిండర్ సెఖన్ మాట్లాడుతూ మిగతా బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూపుపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని అన్నారు.
ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు కరోనా సోకదని తమ అధ్యయనన చెప్పడం లేదని ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ముప్పు తక్కువ అని మాత్రమే చెబుతున్నామని అన్నారు. మరోవైపు 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం కాలుష్యం, జీవనశైలి మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల చర్మ సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొటిమలు, నల్లమచ్చలు…
రేబిస్ అనే వ్యాధి గురించి మాట్లాడితే చాలా మంది మనసులో మొదట గుర్తొచ్చేది కుక్క కాటు. అయితే వైద్య నిపుణులు…
వేసవి కాలం మొదలైతే మార్కెట్లలో రంగురంగుల పండ్ల సందడి మొదలవుతుంది. మామిడి, పుచ్చకాయలతో పాటు మరో చిన్న కానీ విలువైన…
చిన్న పిల్లల అభివృద్ధిలో మాటలు నేర్చుకోవడం ఒక కీలక దశ. అయితే ఇటీవల తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఒక అలవాటు—పిల్లలకు చిన్న…
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…