కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది మార్చి నెల 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు కాగా ఆ తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ లాక్ సడలింపులను అమలు చేస్తోంది. అయితే కరోనా విజృంభణ వల్లే మన దేశంలోని ప్రజలకు లాక్ డౌన్ అనే పదం తెలిసింది.
అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం వెయ్యి సంవత్సరాలుగా ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉన్నారు. తమ ఊరి చుట్టూ గోడను కట్టుకొని లోపల జీవనం సాగిస్తున్నారు. పనుల కోసం పురుషులు మాత్రమే గ్రామం నుంచి బయటకు వెళుతుండగా మహిళలు మాత్రం పూర్తిగా గ్రామానికే పరిమితమవుతున్నారు. దక్షిణ తమిళనాడులోని శ్రీ వైకుంఠం గ్రామంలో మొత్తం 65 కుటుంబాలు ఉన్నాయి.
ఆ ఊరి చుట్టూ వెయ్యి సంవత్సరాల క్రితం పెద్ద మట్టిగోడను నిర్మించారు. ఆ మట్టిగోడకు నాలుగు ద్వారాలు ఉండగా గ్రామంలోకి రావాలన్నా, గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా ఆ నాలుగు మార్గాల ద్వారా మాత్రమే వెళ్లడం లేదా రావడం సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రాకతో పజల జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తుంటే అక్కడ మాత్రం ఇప్పటికీ ప్రజలు ప్రాచీన సంస్కృతినే ఆచరిస్తున్నారు.
మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రెండు నెలల లాక్ డౌన్ కే పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఆ గ్రామ ప్రజలు మాత్రం కాలం మారుతున్నా నేటికీ లాక్ డౌన్ చేసుకుని జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…