టాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచనలు చేస్తుంటారు. అయితే హెల్మెట్ ను కొనుగోలు చేసేవాళ్లు బ్రాండెడ్ కంపెనీల హెల్మెట్లను దుకాణాల ద్వారా, ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిది. రోడ్లపై, అపరిచిత వ్యక్తుల నుంచి హెల్మెట్లను కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
సైబరాబాద్ పోలీసులు తాజాగా నకిలీ హెల్మెట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ హెల్మెట్ల తయారీ జరుగుతోందని యూపీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ఆ హెల్మెట్ల సరఫరా జరుగుతుందని అధికారులు గుర్తించారు. నాసిరకం హెల్మెట్లను వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తలకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నాణ్యత లేని హెల్మెట్లు ధరించడం, హెల్మెట్లు ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది మృతి చెందుతున్నారని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 మంది వాహనదారులు నకిలీ హెల్మెట్ ను ధరించడం వల్ల ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు నకిలీ హెల్మెట్లపై isi మార్క్ వేసి విక్రయిస్తున్నారని చెబుతున్నారు.
ప్లాస్టిక్, ఫైబర్, థర్మాకోల్ తో ప్లాస్టిక్ హెల్మెట్లు తయారవుతున్నాయని తెలుస్తోంది. నకిలీ హెల్మెట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 రూపాయలుగా ఉంటే మార్కెట్ లో 500 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికి ఈ హెల్మెట్లను విక్రయిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…