టాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచనలు చేస్తుంటారు. అయితే హెల్మెట్ ను కొనుగోలు చేసేవాళ్లు బ్రాండెడ్ కంపెనీల హెల్మెట్లను దుకాణాల ద్వారా, ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే మంచిది. రోడ్లపై, అపరిచిత వ్యక్తుల నుంచి హెల్మెట్లను కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
సైబరాబాద్ పోలీసులు తాజాగా నకిలీ హెల్మెట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ హెల్మెట్ల తయారీ జరుగుతోందని యూపీ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ఆ హెల్మెట్ల సరఫరా జరుగుతుందని అధికారులు గుర్తించారు. నాసిరకం హెల్మెట్లను వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తలకు గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నాణ్యత లేని హెల్మెట్లు ధరించడం, హెల్మెట్లు ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది మృతి చెందుతున్నారని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 మంది వాహనదారులు నకిలీ హెల్మెట్ ను ధరించడం వల్ల ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు నకిలీ హెల్మెట్లపై isi మార్క్ వేసి విక్రయిస్తున్నారని చెబుతున్నారు.
ప్లాస్టిక్, ఫైబర్, థర్మాకోల్ తో ప్లాస్టిక్ హెల్మెట్లు తయారవుతున్నాయని తెలుస్తోంది. నకిలీ హెల్మెట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 రూపాయలుగా ఉంటే మార్కెట్ లో 500 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికి ఈ హెల్మెట్లను విక్రయిస్తున్నారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…