Senior artist Anju : చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అలా సౌత్ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి అంజు. అసలు పేరు పార్వతి అయినా అంజుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో శోభన్ బాబు, చిరంజీవి వంటి పలు హీరోలతో నటించిన అంజు హీరోయిన్ గా దాదాపు అన్ని భాషలలో కలిపి 70 దాక సినిమాల్లో నటించిది. తెలుగులో నిరీక్షణ వంటి సినిమాలో నటించిన అంజు చాలా గ్యాప్ తరువాత శేషు లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజు.
టైగర్ ప్రభాకర్ తో పెళ్లి… విడాకులు…
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ అయిన అంజు కన్నడ సినిమాల్లో నటించే సమయంలో విలన్ గా అప్పటికే మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు ప్రభాకర్ ప్రేమలో పడ్డారు. ఒక సినిమాలో ఇద్దరూ కలిసి పనిచేసినపుడు ఏర్పడిన పరిచయంతో టైగర్ ప్రభాకర్ ఆమెకు ప్రపోజ్ చేయడం, అంజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పడంతో ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసేసుకున్నారు అంజు. అయితే అప్పటికే ప్రభాకర్ కి ఒక పెళ్ళై విడాకులు తీసుకున్న విషయం తెలిసినా ప్రేమించారు. ఇద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ. పెళ్లి సమయానికి అంజు వయసు 18 ఏళ్ళు కాగా ప్రభాకర్ వయసు నలభై దాటేసింది. అయినా ఆయనను పెళ్లి చేసుకోడానికి పెద్దలను కాదని చేసుకున్న అంజు కి పెళ్ళైన తరువాతే అప్పటికే ప్రభాకర్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయనే విషయం తెలిసింది. మొదటి పెళ్లి మాత్రమే తెలిసిన అంజు షాక్ అయిందట.
ఇక మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో గొడవలు పెరిగి, ఉంటే సర్దుకుని ఉండు లేకపోతే వెళ్ళిపో అని భర్త నుండి సమాధానం రావడం, చాలా మంది అమ్మాయిలతో తనకు అఫైర్స్ ఉన్నాయనే విషయం తెలియడంతో ఇక ప్రభాకర్ తో ఉండాలేని అంజు అక్కడి నుండి పుట్టింటికి వచ్చేసారట. బాబు పుట్టాక ఒక్కసారిగా కూడా పలకరించలేదని, బాబును చూడలేదని ఆ బాధ, కోపం ఉన్నాయంటూ చెప్తారు అంజు. ఇక టైగర్ ప్రభాకర్ తన 48 ఏళ్ల వయసులో మరణించారు. అప్పటికి బాబు కి మూడు సంవత్సరాలు వయసు అందువల్ల తన తండ్రి గురించి ఏమి పెద్దగా తెలియదు. చనిపోయినపుడు చూడటానికి కూడా వెళ్ళలేదు అంటూ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…