Senior journalist Bharadwaj : చిరంజీవి ‘పునాది రాళ్లు’ సినిమా తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినా ఆయన్ను మాస్ హీరోని చేసింది మాత్రం ‘ఖైదీ 786’ సినిమానే. కృష్ణ చేయాల్సిన ఆ సినిమా చిరంజీవి దగ్గరకి రావడం, ఆ సినిమా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించడం, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం జరిగాయి. ఆ సినిమాతో చెప్పాలంటే చిరంజీవి శకం మొదలయినట్లయింది. ఇక మాస్ హీరో ఇమేజ్ తో చిరు వరుసగా హిట్లందుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారు. అలా మైలు రాయి లాంటి సినిమాను అందించిన కోదండ రామి రెడ్డి గారిని చిరంజీవి గారు మరచిపోయి ఆయనను అవమానించారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.
చిరంజీవి ఎదుగుదలలో వాళ్లిద్దరూ కీలకం…
చిరంజీవి హీరోగా మొదలయ్యాక ‘న్యాయం కావాలి’ సినిమాతో కోదండరామిరెడ్డి చిరు జర్నీ మొదలయింది. న్యాయం కావాలి లో నెగెటివ్ షేడ్ అయినా ఆ సినిమా సూపర్ హిట్, ఇక ఆ తరువాత ‘అభిలాష’ వంటి హిట్స్ ఉన్నా ఆరో చిత్రంగా వీళ్ళ కలయికలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి కెరీర్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత వచ్చిన ‘గుండా’ అంతగా ఆడకపోయినా ‘ఛాలెంజ్’ సినిమా మళ్ళీ సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు 23 సినిమాలను కోదండరామిరెడ్డి గారు చిరు తో చేసారు. అందులో దాదాపు 15 సినిమాలు సూపర్ హిట్లుగా ఉన్నాయి. అలాంటి అయన గురించి చిరంజీవి మర్చిపోయి ఇతర డైరెక్టర్లను మాత్రమే తన కెరీర్ కు దోహదపడ్డారని చెప్పడం కొంచెం కోదండ రామిరెడ్డి గారిని బాధించింది. దీని గురించి ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా స్పందించారు.
ఈ విషయం గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ చిరంజీవి కెరీర్ పెరుగుదలకు కారణం అయిన ఇద్దరు డైరెక్టర్ల గురించి చెప్పాల్సి వస్తే మొదట కోదండ రామిరెడ్డి, నెంబర్ 2 గా రవి రాజా పినిశెట్టి పేర్లు చెప్పాలంటూ అభిప్రాయపడ్డారు. అప్పట్లో చిరు చేసన సినిమాల్లో దాదాపు వీళ్ళిద్దరూ సూపర్ హిట్లు ఇచ్చి అయనను మెగాస్టార్ చేసారు. అలాంటిది కోదండ రామిరెడ్డి ని విస్మరించి రాఘవేంద్ర రావు వంటి డైరెక్టర్ల పేర్లను చెప్పడం అంత సమంజసంగా లేదు. ఎప్పుడూ వివాదాల జోలికి పోనీ చిరు ఇలా ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆయన గుర్తించినా లేకపోయినా కొదండరామిరెడ్డి సినిమాలు చిరంజీవి కెరీర్ లో కీలకమని అందరికీ తెలుసు అంటూ అభిప్రాయపడ్డారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…