Senior Journalist Bhardwaja : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఒరిజినల్స్ లో వస్తున్న అన్ స్టాపబుల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ షో సీజన్ వన్ అయిపోయి సీజన్ 2 కూడా మొదయింది. సీజన్ 2 లో మొదటి ఎపిసోడే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ని ఆయన కొడుకు నారా లోకేష్ ని పిలిచి పొలిటికల్ హీట్ పెంచారు బాలయ్య. ఇక ఆ షోలో వైస్సార్ గురించి ప్రస్తావన రావడం నాకు మంచి మిత్రుడు వైస్సార్ అంటూ చంద్రబాబు చెప్పడం ఇవన్నీ కొత్తగా అనిపించాయి. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
వైస్సార్ ను, జగన్ నుండి దూరం చేస్తున్నారు…
అన్ స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే స్పీకర్ సురేష్ రెడ్డి సీనియర్ హీరోయిన్ రాధిక రానున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, బాలకృష్ణ ముగ్గురూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, పైగా స్నేహితులు కావడంతో ఈ షోలో మరింత ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ని పిలవడం రాజకీయ వ్యూహమే అంటూ అభిప్రాయపడ్డారు. వైస్సార్ ను వైస్సార్సీపీ నుండి దూరం చేసే వ్యూహన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు వచ్చినపుడు వైస్సార్ నా మిత్రుడు అనడం అలాగే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినపుడు వైస్సార్ గొప్ప వ్యక్తి అంటూ బాలకృష్ణ పొగడడం ఇవన్నీ కూడా వైస్సార్సీపీ నుండి వైస్సార్ ను వేరుగా చూడడంలో భాగమే అంటూ అభిప్రాయపడ్డారు.
కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హెలీకాప్టర్ ప్రమాదం ముందు సంఘటనలు మాట్లాడటం, వైస్సార్ కు ఒక మంత్రి తప్పుడు సలహాలు ఇచ్చేవాడంటూ చెప్పడం ఇవ్వన్నీ కూడా రాజకీయ వ్యూహాలు అంటూ చెప్పారు. కిరణ్ ప్రస్తుతం కాంగ్రెస్ లో క్రియాశీలకంగా లేకపోయినా కాంగ్రెస్ నుండి దూరం కాలేదు. అప్పట్లో వైస్సార్ కి దగ్గరగా ఉన్న వారిలో కిరణ్ అలాగే సురేష్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు వారిద్దరు జగన్ కి దగ్గరగా లేరు అంటూ చెప్పారు. జగన్ ఎలాగైతే ఎన్టీఆర్ ను టీడీపీ నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడో అలానే టీడీపీ కూడా వైస్సార్ ను వైసీపీ నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చెప్పారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…