Senior Journalist Bharadwaja : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారు జామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనను చివరిసారిగా చూడాలని ఆశపడ్డారు. కానీ నిర్వహణ లోపం వల్ల అభిమానులు నిరాశ చెందారు. ఇక ఈ విషయాల పై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను చెప్పారు.
అంత్యక్రియల్లో నిర్వహణ లోపం…
కృష్ణ గారి గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారికి ఉన్నంత మంది ఫ్యాన్స్ కృష్ణ గారికి ఉన్నారంటూ చెప్పారు. ఎన్టీఆర్ గారు పౌరణికం జానపదం లో అశేష అభిమానులను మూటగట్టుకున్నారు. ఇక కృష్ణ గారు పౌరణికాన్ని వదిలి కుటుంబం కథా చిత్రాలను అలాగే జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను తీసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా ఆయనకు అభిమానులుగా మారారు. గుంటూరు ప్రాంతంలోని ముస్లిం యువత కృష్ణ గారికి వీరాభిమానులు. ఇక ఆయనకు దాదాపు 2000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. అంతే కాకుండా ఒక తమ్ముడిని కేవలం అభిమానుల మంచి చెడులను చూడటానికే కృష్ణ గారు పెట్టడం ఆయనకి అభిమానుల మీద ఉన్న ప్రేమ అర్థం అవుతుంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
ఇక ఆయనకున్న అభిమానుల సంఖ్యను కుటుంబ సభ్యులు అంచనా వేయలేక పోయారు. అంత్యక్రియల సమయంలో సామాన్య ప్రజలకు కూడా కృష్ణ గారిని కడసారి చూసే అవకాశం కల్పించుంటే బాగుండేది. ఆయన కడసారి చూపు కోసం కుటుంబాలు కుటుంబాలు రావడం ఎవరూ ఊహించలేదు. కానీ అంతటి లెజెండ్రి హీరో చనిపోయినపుడు అభిమానులకు కూడా కడసారి చూసే అవకాశం ఇవ్వాల్సింది. బారికేడ్లు విరగొట్టి, చాలా మంది అసహనానికి లోనయ్యారు. ఇక పెద్ద కర్మ రోజునాడు ప్రభాస్ సొంతూర్లో అభిమానులకు అందరికీ అవకాశమిస్తూ కార్యక్రమం చేశారు. అలా బుర్రిపాలెంలో కూడా కృష్ణ గారికి పెద్ద కర్మ నిర్వహిస్తే అభిమానులు కొంత శాంతిస్తారు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…