Senior Journalist Bhardwaja : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకు ఆసియన్ పాటకు ఈ అవార్డు మొదటిసారి రావడం, అందునా మన తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పడిన కష్టానికి మంచి ఫలితం దక్కిందని చెప్పొచ్చు. ఇక గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు. మరో వైపు ఆర్ఆర్ఆర్ కి వస్తున్న అవార్డులాన్నీ కొనుకుంటున్నవి అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
అవార్డును రాజమౌళి కొన్నాడా…
నాటు నాటు పాటకి కీరవాణి కి అవార్డు రావడం పట్ల ఇప్పుడు నెట్టింట్లో చర్చ నడుస్తోంది. అంతకుముందు తెలుగులో నాటు నాటు కంటే గొప్పగా పాటలు లేవా, లేక మ్యూజిక్ డైరెక్టర్ల్స్ లేరా అనే మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ అవార్డు ఈ పాటకు వచ్చినందుకు అంతకుముంది పాటలు, మ్యూజిక్ డైరెక్టర్లు వేస్ట్ అనుకోవడం పొరపాటు. ఒకవేల అప్పటి వారికి లాబీయింగ్ అనేది తెలిసి ఉంటే ఖచ్చితంగా అవార్డు వచ్చి ఉందేది అంటూ అభిప్రాయపడ్డారు. రాజమౌళి సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయాల కంటే మార్కెట్ అనే విషయం మీద ఎక్కువ ఆలోచిస్తాడు. తెలుగులో మార్కెట్ గురించి ఆలోచించే దర్శకులు చాలా తక్కువ అంటూ చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికగా రాజమౌళి అందుకుంటున్న అవార్డులన్నీ తన మార్కెట్ పెంచుకోడానికి ఉపయోగపడుతాయి అంటూ తెలిపారు.
అందుకోసం రాజమౌళి అవార్డుల విషయంలో డబ్బులు ఖర్చు పెట్టి లాబియింగ్ చేసి ఉండవచ్చు. ఎక్కడైనా లాబియింగ్ చేస్తేనే అవార్డులు వస్తాయి. అయినా రాజమౌలి తనని తాను ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసుకుంటూ తెలుగు సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ఇది పాజిటివ్ అంశం, ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్ అవార్డు అలానే గోల్డెన్ గోలబ్ వచ్చాయి. ఇకపై ఆస్కార్ కూడా ఏదో ఒక కేటగిరిలో రావొచ్చు. ఇదంతా కూడా తన మార్కెట్ ను విస్తృతపర్చుకోడానికి అలానే తనను ఇంకొంచం ఎత్తుకు ఎదగడానికి రాజమౌళి ఉపయోగించుకుంటారు అందులో తప్పు లేదు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…