Krishna & Shobhan Babu : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలో అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదనాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా, గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మల్టీ స్టారర్ సినిమాలను కూడా దాదాపు అందరి హీరోలతో చేశారు. అలా శోభన్ బాబుగారి తో ముందడుగు, మండే గుండెలు అంటూ హిట్స్ ఇచ్చారు వీరిద్దరి ధ్వయం. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఇద్దరూ కలిసి సినిమాలో నటించాలనుకొని చివరికి శోభన్ బాబు గారు నిరాకరించడంతో కృష్ణ గారు మాత్రమే సోలో గా సినిమా చేసారు.
ఆ సినిమా తరువాత కలిసి నటించలేదు…
కృష్ణ, శోభన్ బాబు గారు ఎన్నో మల్టీ స్టార్రర్ లలో కలిసి నటించారు. ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. వాళ్లిద్దరూ కలిసి మంచి మిత్రులు, మండే గుండెలు, ముందడుగు, కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు, మహా సంగ్రామం సినిమాల్లో నటించారు. అయితే మహా సంగ్రామం సినిమా తరువాత శోభన్ బాబు గారు ఇక మల్టీ స్టారర్ చేయకూడదని అనుకున్నారు. ఆ సినిమాలో శోభన్ బాబు పాత్ర నిడివి కృష్ణ గారి పాత్ర కంటే తక్కువగా ఉందని అభిమానులు గొడవ చేయడంతో ఇకపై మల్టీ స్టారర్ చేయకూడదని శోభన్ బాబు భావించారు.
అయితే కృష్ణ శోభన్ బాబు గారు చాలా సన్నిహితంగా ఉండేవారు. శోభన్ బాబు గారు భూమి పై పెట్టుబడి పెట్టమని పిల్లల భవిష్యత్ బాగుంటుందని చెప్పినా కృష్ణ వినలేదట. సినిమాల్లో పెట్టి చాలా నష్టాలను చూసారుసని శోభన్ బాబు ఎపుడూ తిట్టేవారట కృష్ణ గారిని. ఈ విషయం కృష్ణ గారు స్వయంగా శోభన్ బాబు గారు మరణించినపుడు చెప్పారు. ఇక కృష్ణ గారు కూడా గతేడాది నవంబర్ లో మరణించారు. ఆయన మరణంతో అప్పటి లెజెండ్రీ నటుల శకం ముగిసినట్లయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…