Senior Journalist Bhardwaja : దాసరి నారాయణ రావు గారి శిష్యుల్లో ఒకరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజా చంద్ర గారి అసలు పేరు వెంకటేశ్వరరావు, ఈయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. రాజా చంద్ర గారు దాసరి గారి వద్ద చాలా సినిమాలకు పని చేసిన ఆయన విజయబాపిణీడు గారి నిర్మాణంలో మొదటి సారిగా బొమ్మరిల్లు అనే సినిమా డైరెక్ట్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా సినిమాలను చేసిన ఆయన అనుమానస్పద రీతిలో చెన్నై రోడ్డు మీద శవంలా కనిపించడం అందరినీ అప్పట్లో షాక్ కి గురిచేసింది.
చంపింది ఎవరో ఇప్పటికీ తెలియదు…
రాజచంద్ర గారికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నా మళ్ళీ నటి కృష్ణవేణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణవేణి గారు నగ్న సత్యం సినిమాతో సినిమాల్లోకి వచ్చి ఆ తరువాత మాదాల రంగారావు గారి సినిమాల్లో నటించింది. ఆ తరువాత రాజచంద్ర గారి డైరెక్టన్లో కామెడీ పాత్రలను ఎక్కువగా చేసారు. అలా ఏర్పడిన పరిచయంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కృష్ణవేణి కి కూడా పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. భర్తను వదిలి జీవినార్థం చెన్నై సినిమాల్లో అవకాశాల కోసం ఆమె వచ్చారు.
ఇక డైరెక్టర్ గా మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో 1987 లో రాజచంద్ర ను చంపి చెన్నై రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. చంపింది ఎవరో ఇప్పటికీ తెలియదు కానీ కృష్ణ వేణి ఇప్పటికీ ఇంటర్వ్యూల్లో ఆయనను చంపించింది అప్పట్లో ఒక అగ్ర హీరోయిన్ అంటూ ఇప్పుడు ఆమె మరణించింది అంటూ చెప్తుంటుంది కానీ ఆ హీరోయిన్ ఎవరో మాత్రం చెప్పరు. దాసరి గారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్నా కూడా అతని హత్య వెనుక ఉన్నది ఎవరన్న సంగతి తెలియలేదు. ఆయన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆయనది హత్య అని తెలియదు అంటూ రాజా చంద్ర గారి ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…