Senior Journalist Bhardwaja : మంచు విష్ణు బాగా గ్యాప్ తీసుకుని మళ్ళీ కామెడీ ఎంటర్టైనర్ ను నమ్ముకుని బరిలోకి వచ్చారు. దేనికైనా రెడీ సినిమా దర్శకుడు శివ నాగేశ్వరావు డైరెక్టర్ లో ‘జిన్నా’ సినిమా చేసారు మంచు విష్ణు. ఆయనకు జోడిగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. ఇక సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా మంచు ఫ్యామిలీ బాగా ఆశలు పెట్టుకుంది. మోహన్ బాబు నిర్మాతగా మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే విషయంలో కూడా సలహాలు ఇచ్చారట. మా అధ్యక్షుడు అయిన తరువాత వచ్చిన ఈ సినిమా మీద విష్ణు కి చాలా ఆశలే ఉన్నాయి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తున్న థియేటర్ కి మాత్రం జనాలు రాకపోవడం విచిత్రం. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు తనదైన శైలిలో విశ్లేషించారు.
ప్రేక్షకులు మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు…
సినిమా బాగుందనే టాక్ వచ్చినా సినిమాకు ఎవరూ వెళ్లడం లేదు, వసూళ్లు మొదటి రోజు కేవలం పది లక్షలు. ఇక దీపావళి సెలవులు కాబట్టి ఆ మాత్రం థియేటర్ నిండింది, ఇక సెలవులు అయిపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది, ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. సినిమాలో ఏదో గొప్ప విషయం, కాంట్రావెర్సీ, లేక విజువల్ వండర్ గా ఉంటే తప్పితే సినిమాను చూడాలని జనాలు థియేటర్ కి వెళ్లడం లేదు. అలా కాకుండా రొటీన్ సినిమా అయితే బాగున్నా ఓటీటీ లో వచ్చే వరకు వేచి చూస్తున్నారు.
ఇక సినిమా బాగున్నా టికెట్స్ రేట్స్ వల్ల ప్రేక్షకులు థియేటర్ కి దూరం అవుతున్నారు. కేవలం ఇపుడే ఆ సినిమా చూడాలి, అది థియేటర్ లో చూడాల్సిన సినిమా అనే భావన కలిగితేనే అటువంటి సినిమాలకు మాత్రమే వెళుతున్నారు జనాలు. అలా జనాలు ఈ మధ్య కాలంలో వెళ్ళింది ‘కాంతార’ సినిమా కోసం. ఇక జిన్నా లాంటి సినిమా బాగున్నా ఓటీటీలో వచ్చాక చూసుకోవచ్చు అనుకుంటున్నారు. మంచు విష్ణు తన సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కి వస్తున్న కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలించి ఎలాగూ ఆయన మా అధ్యక్షుడు కాబట్టి థియేటర్ల విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…