Senior journalist Bhardwaja : ఎన్టీఆర్ హీరోగా 1977 సంవత్సరం లో వచ్చిన మూడు చిత్రాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. ఈ అరుదైన ఘనత మరే హీరోకి ఇంతవరకూ లేదు. ఎన్టీఆర్ కూడా తిరిగి అలాంటి రికార్డును అందుకోలేదు. 1977 లో జనవరి సంక్రాంతికి విడుదల అయిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా మంచి విజయం పొందిది. ఇక ఆ సినిమా తరువాత విడుదల అయిన ‘అడవిరాముడు, యమగోల’ కూడా అదే సంవత్సరం విడుదల అయి హ్యాట్రిక్ విజయన్ని నమోదు చేసాయి. ఇంత ఘన విజయాన్ని ఎన్టీఆర్ కెరీర్ లోనే అందించిన అడవిరాముడు, యమగోల సినిమాలు మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లాయి కానీ ఆయన చేయకపోవడం తో ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాయి.
తెర వెనుక జరిగింది ఇదే…
శోభన్ బాబు గారితో రెండు సినిమాలు చేసి ప్లాపులు మూటగట్టుకున్న సత్యచిత్ర బ్యానర్ వాళ్ళు సూర్య నారాయణ, సత్య నారాయణలు ‘అడవిరాముడు’ సినిమాను ఎన్టీఆర్ తో తీశారు. కానీ అంతకు ముందు జరిగిన విషయాలే ఆసక్తికరం. శోభన్ బాబు గారితో ‘ప్రేమ బంధం’ అనే సినిమాను తీసిన సత్యచిత్ర బ్యానర్ వాళ్ళు ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమా దెబ్బకి నష్టాలు చూసారు. ఒకసారి వాళ్ళు ఎన్టీఆర్ కు కనబడితే ఆయన మీ సినిమా ఏమైంది విడుదల అయ్యిందా అని అడుగగా మీ ఆరాధన సినిమా దెబ్బకి పోయింది అని చెబితే అయితే ఒక కథ సిద్ధం చేసుకొండి సినిమా చేస్తాను మీకు అని హామీ ఇచ్చారట. ఇక సూర్య నారాయణ, సత్య నారాయణ లు కన్నడ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి రాఘవేంద్ర రావు ను డైరెక్టర్ గా పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రీమేక్ అంటున్నారు కాబట్టి దర్శకుడు లాల్ అయితే బాగుంటారు అని చెప్పారట, అదీకాక అవుట్ డోర్ రానని చెప్పారట. ఇక కథ శోభన్ బాబు దగ్గరికి వెళ్ళింది. అయితే అయన నాకు ఇలాంటి కథలు నప్పవు అని చెప్పారట అప్పటికే రెండు ప్లాపులు వచ్చినందున వారికి మరింత నష్టం చేయకూడదని భావించారు. ఇక సినిమాను అవుట్ డోర్ ఫారెస్ట్ లో తీయాలనీ ఫిక్స్ అయిన నిర్మాతలు మళ్ళీ ఎన్టీఆర్ ను అడిగితే ఆయన ఇక్కడైతే నేను రెండు సినిమాలు చేస్తాను అడవికి వచ్చి నేనేం చేయాలి అని అడిగితే రెండు సినిమాల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి సినిమా తీశారు. ఇక సినిమా హిట్ అయ్యాక ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ డబల్ అయిపోయింది.
ఇక ‘యమగోల’ సినిమా కథ కూడా ముందు శోభన్ బాబు వద్దకు వెళితే ఇలాంటి పాత్రలు నాకంటే ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటాయి ఆయనను కలవమని నిర్మాత వెంకటరత్నం గారికి చెప్పారట. అయితే అప్పటి వరకూ వెంకటరత్నం గారు శోభన్ బాబు గారితో మాత్రమే సినిమాలు చేసారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లాలంటే ఇబ్బంది పడ్డారు. ఇక నరసరాజు గారి ప్రోత్సాహం తో వెళ్లగా ఆయన కథకు వెంటనే కనెస్ట్ అయ్యారు. అయితే సినిమాలో యముడి పాత్ర మీరు, సత్యం పాత్ర బాలకృష్ణ తో వేయిద్దామని నరసరాజు గారు అభిప్రాయపడ్డారు. కానీ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ కు అంత వయసు కానీ, అనుభవం కానీ సత్యం పాత్ర చేయడానికి లేవు. నేను సత్యం పాత్ర చేస్తాను యముడి పాత్రకు కైకాల సత్యనారాయణ ను తీసుకుందాం అని చెప్పారట. ఇక సత్యనారాయణ ను కూడా ఎన్టీఆర్ ఒప్పించారట. అలా యమగోల కూడా షూటింగ్ జరుగుతుండగా రైటర్ నరసరాజు ఖచ్చితంగా సెట్స్ లో ఉండాలిసిందే అని ఎన్టీఆర్ గారు షరతు పెట్టడం వల్ల రోజూ సెట్స్ లో డైలాగులలో మార్పులు జరిగేవట. ఇక అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ను విమర్శిస్తూ కొన్ని డైలాగులు ఉండటం వల్ల వెంకట రత్నం గారు భయపడ్డారు. సినిమా విడుదల అయి హిట్ అయ్యాక కానీ ఆయనకు టెన్షన్ తగ్గలేదట.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…