Senior Journalist Imandhi Ramarao : నెల్లూరుకి చెందిన రత్నకుమారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ . తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది . అయితే సినిమాల్లో చిన్న చిన్న వేషాలేసుకుంటూ మొదట్లో ఆమె చాలా ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నారు. అలా ఆమెను అవమానించినవారే సహాయం కోసం వచ్చినపుడు ఆమె ఎలా ప్రవర్తించారు వంటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
రాజనాలను లోపలికి పిలిచి….
సినిమాల్లో ఇంకా చిన్న చిన్న వేషాలు వేసుకునే టైం లో వాణిశ్రీ గారిని రాజనాల గారు అవమానించారు అంటూ ఇమంది రామారావు ఆ సంగతులను తెలిపారు. అప్పట్లో రాజనాల గారు స్టార్ గా వెలుగుతున్న సమయంలో ఆయనకున్న కోపం సెట్స్ లో బాయ్స్ మీద చూపించేవరని అప్పట్లో ఎవరి కుర్చీ వాళ్ళు తెచ్చుకోగా రాజనాల గారికి కుర్చీ లేకపోతే వాణిశ్రీ గారు ఆటపట్టించడానికి మీకు కుర్చీ లేదే ఇప్పుడెలా అంటూ మాట్లాడితే ఆయన కోపంతో వేరేవాళ్ళ కుర్చీని కాలితో తన్ని అందులో కూర్చున్నారట. అది కుర్చీని తన్నినట్లుగా లేదు నన్ను అవమానించినట్లే వుంది అని వాణిశ్రీ గారు బాధపడటం అది పెద్ద గొడవ కావడంతో ఆయన క్షమాపణ మాత్రం చెప్పలేదట. ఒక చిన్న ఆర్టిస్ట్ కు నేను సారీ చెప్పడం ఏమిటి అని చెప్పలేదట. ఇక తరువాతి కాలంలో హీరోయిన్ గా వాణిశ్రీ మంచి స్టార్ అవ్వడం రాజనాల గారికి అవకాశలు తగ్గి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆమెను సహాయం అడగటానికి ఇంటికి వెళ్లగా డబ్బు అడగలేక పోయాడట.
గతంలో అవమానించిన దానికి క్షమాపణ చెప్పగా లోపలోకి పిలిచి అవన్నీ ఇపుడెందుకని వాణిశ్రీ చెప్పి భోజనం పెట్టించిందట. ఆపైన ఇంటికి కారులో డ్రాప్ చెయమని డ్రైవర్ కి చెప్పగా ఆయన డబ్బు అడగటానికి ఇబ్బంది పడ్డారట. అయితే ఇంటి దగ్గర దిగబెట్టి డ్రైవర్ ఒక కవర్ లో 25 వేల రూపాయల డబ్బులుచ్చి మేడం ఇమ్మన్నారు అని చెప్పి వెళ్ళాడట. అలా అవమానించిన ఆమె మళ్ళీ సహాయం చేసారని ఆనాడు రాజనాల బాగా బాధపడ్డారంటు ఇమంది రామరావు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…