Senior Journalist Imandhi Ramarao : అలనాటి అందాల తార అందం అభినయం రెండూ కలగలసిన రూపం శ్రీదేవి. ఆమె అమాయకత్వం, నటన, డాన్స్, గ్లామర్ ఇలా అన్నింటిలోనూ ఇంకెవరూ పోటీ రారు. కొన్నేళ్లపాటు సినిమా రంగాన్ని ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఏలిన ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం మాత్రం విషాదంగానే ముగిసింది. అతి చిన్నవయసులోనే ఇంటి బాధ్యతలను మీదేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీదేవి కుటుంబం కోసం కస్టపడి చివరికి వారి చేతిలోనే దారుణంగా మోసపోయింది. ఇక పెళ్లి విషయములోనూ రెండో పెళ్లివాడిని చేసుకుంది. చివరికి అనుమానస్పదంగా దుబాయ్ హోటెల్ లో బాత్ టబ్ లో మరణించింది. ఇక శ్రీదేవి గురించిన ఆసక్తికర విషయాలను ఇమంది రామారావు గారు పంచుకున్నారు.
మద్యం అలవాటు చేసింది వాళ్ళే…
శ్రీ దేవి మద్యం సేవించి బాత్ టబ్ లోనే గుండెపోటు తో మరణించింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు మద్యం అలవాటు ఇలా వచ్చింది అనే విషయం గురించి ఇమంది రామారావు గారు మాట్లాడుతూ చిన్నతనంలో బాలనటిగా నటిస్తున్న సమయంలో షూటింగ్ నుండి ఇంటికి వచ్చాక ఏదైనా బాధ కలిగి ఏడిస్తే తల్లి ఆ ఏడుపును మాన్పించడానికి ఇతరులు నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉండాలని మద్యం తాగించి అలవాటు చేసిందట. అయితే శ్రీదేవి ఒక ఫుల్ బాటిల్ మందు తాగినా కూడా ఏ మాత్రం మాటలను తప్పుగా మాట్లాడేది తడబడేది కాదు అని ఇమంది గారు చెప్పారు.
ఆమె చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే కారణంతోనే ఆమెను పక్కాగా అలా చనిపోయేలా ప్లాన్ చేశారంటూ అనుమానం వ్యక్తం చేసారు. ఇక శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ శ్రీదేవి అంతటి స్టార్ అవ్వలేదని తనకు గోల్డెన్ స్పూన్ తో పుట్టడం వల్ల తనకు కష్టాలు తెలియక పోవడం వల్ల ఇంకా అంత బాగా నటించడం అవి రాలేదని, ఇక ఝాన్వి శ్రీదేవి కూతురే అయినా శ్రీదేవి అంత అందగత్తె కాదు అంటూ చెప్పారు. అయితే తను శ్రీదేవి అంత గొప్ప నటిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇక ఝాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము మా అమ్మాను సరిగా పట్టించుకోలేదు ఆమె గురించి ఆలోచించలేదు అని నోరుజారింది. ఇక ఈ మాటలతో శ్రీదేవి మరణం మీద మరిన్ని అనుమానాలు బలపడ్డాయంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…