Sensational details in the Dharmasthala case...!
ధర్మస్థల, కర్ణాటక: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరిగిన అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చేపట్టిన తవ్వకాల్లో కీలక ఆధారాలు లభ్యం కాగా, మరోవైపు బెళ్తంగడి పోలీస్ స్టేషన్లో రికార్డులు గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా SIT అధికారులు ధర్మస్థల పరిసరాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటివరకు 10కి పైగా ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. వీటిలో ఆరో ప్రదేశంలో కొన్ని ఎముకలు, దుస్తులు, పర్సులు వంటి మానవ అవశేషాలు లభించాయి. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే, ఇవి ఎవరివి అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం (ఆగస్టు 4) నుంచి 11, 12వ ప్రాంతాల్లో కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మెడికో అనన్య భట్ తల్లి సుజాత భట్.. అస్థిపంజరాల గుర్తింపు కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) వంటి ఆధునిక పరికరాలను వాడాలని SIT అధికారులను కోరారు.
దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2000 నుండి 2015 మధ్యకాలంలో బెళ్తంగడి పోలీస్ స్టేషన్లో నమోదైన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు గల్లంతైనట్లు ఆర్టీఐ కార్యకర్త జయంత్ వెల్లడించారు. ఈ రికార్డుల గల్లంతుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని, ఇది దర్యాప్తును ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన SIT అధికారులకు అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు.
ధర్మస్థల కేసులో జరుగుతున్న ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో, ప్రజల్లో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…