Shaakuntalam: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నీలిమ గుణం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నీలిమ గుణ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజు తమకు చాలా సపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
ఇక సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని నీలిమ తెలియజేశారు.ఇకపోతే మోహన్ బాబు గారితో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేదే నా కల అయితే ఈ సినిమా విషయంలో ఆకల నెరవేరిందని నీలిమ తెలియజేశారు. ఇకపోతే శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ పాత్ర గురించి ఈమె పలు విషయాలు తెలియజేశారు.
ముందుగా ఈ పాత్రలో చేయడం కోసం ఎన్టీఆర్ ను అనుకున్నామని నీలిమా తెలిపారు. అయితే తారక్ ను సంప్రదించలేదని తెలియజేశారు. దుష్యంతుడి పాత్ర పరిమితం కావడం చేతనే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించలేదని ఈ సందర్భంగా నీలిమ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…