Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?
Shalini Pandey: షాలిని పాండే అంటే టక్కున గుర్తు రాకపోయినా అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే అందరికీ ప్రీతి పాత్రలో నటించిన ఈ హీరోయిన్ టక్కున గుర్తుకు వస్తారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలిని పాండే మొదటి సినిమాతోనే ఎంతో మంది యువతను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈమె ఒక్కసారిగా యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండతో కలిసి ఈమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఈ లిప్ లాక్ సన్నివేశాలతో యువతను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలకు ముందు వరకు ఏ విధమైనటువంటి అంచనాలు లేకపోయినా ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షోతోనే అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ యువతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలకు క్రష్ అయ్యారు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమా అవకాశాలను అందుకోని ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటించే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ టాప్ హీరోగా కొనసాగుతున్నారు.
ఇక అందరిలాగే షాలిని పాండే కూడా మొదటి సినిమాతోనే యువతను ఎంతో ఆకట్టుకోవడంతో ఈమెకు కూడా వరుస అవకాశాలు వస్తాయని భావించారు.అయితే ఈమె అనుకున్న విధంగా తనకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదు.కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో ఓ కీలక పాత్రలో షాలిని నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు దూరమైన షాలిని బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.అర్జున్ రెడ్డి సినిమాలో ఎంతో బొద్దుగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సన్నజాజి తీగల మారిపోయారు. ఈ క్రమంలోని ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అసలు అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలినినేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…