Puri Jagannadh -Lavanya: పూరి జగన్నాథ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన విజయ్ దేవరకొండతో కలిసి చేసిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది. అదేవిధంగా విజయ్ దేవరకొండతో కలిసి తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్ కు మరొక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని అందుకే ఆయన తన భార్య లావణ్యను దూరం పెట్టి ఆ హీరోయిన్ తో ఉన్నారనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తన భార్య లావణ్య గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే తన తల్లిదండ్రుల మధ్య ఇలాంటి గొడవలు లేవని వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారని పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ లావణ్య పెళ్లి చేసిన వారిలో అంబర్ పేట శంకరన్న ఒకరు.ఈ క్రమంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ లావణ్య మధ్య గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు.
పూరి జగన్నాథ్ లావణ్య ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.లావణ్య తన సమీప బంధువు అమ్మాయి కావడంతో తన పెళ్లి దగ్గర ఉండి చేసామని శంకరన్న వెల్లడించారు. పెళ్లయిన తర్వాత పూరి జగన్నాథ తనకు ఒక మంచి స్నేహితుడిగా మారిపోయారు.ఇప్పటికి తాను పూరి జగన్నాథ్ లావణ్య కు ఫోన్ చేసి మాట్లాడుతుంటారని అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటానని శంకర్ పేర్కొన్నారు.అయితే వారి మధ్య గొడవలు ఉన్నాయని విడిపోతున్నారంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమేనని శంకరన్న వారిద్దరి మధ్య విభేదాలు గురించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…