Puri Jagannadh -Lavanya: పూరి జగన్నాథ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన విజయ్ దేవరకొండతో కలిసి చేసిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది. అదేవిధంగా విజయ్ దేవరకొండతో కలిసి తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్ కు మరొక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని అందుకే ఆయన తన భార్య లావణ్యను దూరం పెట్టి ఆ హీరోయిన్ తో ఉన్నారనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తన భార్య లావణ్య గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే తన తల్లిదండ్రుల మధ్య ఇలాంటి గొడవలు లేవని వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారని పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ లావణ్య పెళ్లి చేసిన వారిలో అంబర్ పేట శంకరన్న ఒకరు.ఈ క్రమంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ లావణ్య మధ్య గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు.
పూరి జగన్నాథ్ లావణ్య ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.లావణ్య తన సమీప బంధువు అమ్మాయి కావడంతో తన పెళ్లి దగ్గర ఉండి చేసామని శంకరన్న వెల్లడించారు. పెళ్లయిన తర్వాత పూరి జగన్నాథ తనకు ఒక మంచి స్నేహితుడిగా మారిపోయారు.ఇప్పటికి తాను పూరి జగన్నాథ్ లావణ్య కు ఫోన్ చేసి మాట్లాడుతుంటారని అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటానని శంకర్ పేర్కొన్నారు.అయితే వారి మధ్య గొడవలు ఉన్నాయని విడిపోతున్నారంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమేనని శంకరన్న వారిద్దరి మధ్య విభేదాలు గురించి క్లారిటీ ఇచ్చారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…