Murali Mohan: టాలీవుడ్ క్రేజీ కపుల్స్ సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు సంవత్సరం కావస్తున్న ఇప్పటికి వీరి విడాకులకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సమంత నాగచైతన్య గురించి సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ…ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో మూడు అపార్ట్మెంట్ లు కట్టుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టుకున్నవి. ఆ అపార్ట్మెంట్ నచ్చడంతో నాగచైతన్య అమ్ముతారా అని అడిగారు. అయితే తాను మా కోసం కట్టుకున్నవని చెప్పడంతో నాగచైతన్య ఈ విషయం నాగార్జునకి చెప్పారు. నాగచైతన్యకు అపార్ట్మెంట్ నచ్చింది తనకు ఇవ్వండి అని నాగార్జున అడగడంతో కాదనలేకపోయాను.
మా అబ్బాయి కోసం కట్టించిన అపార్ట్మెంట్ నాగచైతన్యకు ఇచ్చాను.నాగచైతన్య సమంత ఇద్దరు అదే అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటూ సంతోషంగా గడిపేవారు.ఎప్పుడూ కూడా వీరి మధ్య గొడవ జరిగినట్టు తాను వినలేదని అలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోతున్నారనే విషయం నాకు ఏమాత్రం తెలియదని మురళీమోహన్ తెలిపారు.
సమంత నాగచైతన్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు…
నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోతున్నారని మా పనిమనిషి వచ్చి చెప్పే వరకు నాకు తెలియదని మురళీమోహన్ తెలిపారు.అయితే అప్పటికే నాగచైతన్య అపార్ట్మెంట్లో కాకుండా వేరే హోటల్లో ఉండేవారు.దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారని భావించాను.ఇలా విడాకులు తీసుకొని విడిపోతున్నారనే విషయం పనిమనిషి ద్వారా తెలిసింది. కానీ అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారనే విషయం ఇప్పటికీ తనకు తెలియదని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…