Bigg Boss: అయ్యో బిగ్ బాస్.. ఎంత పని చేశావ్.. వారిని విడదీశావ్.. సిరితో షన్ను ప్రేమ ప్రయాణం?
Bigg Boss: బిగ్ బాసోడా… ఎంత పనిచేశావు అని అనుకుంటున్నారు నెటిజెన్లు. ఎందుకో తెలుసా.. బిగ్ బాస్ పెట్టిన పెంట వల్ల ఇద్దరు జంటల బంధాలు తెగిపోయాయి. వాళ్లెవరో కాదు షన్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన, శ్రీహాన్- సిరిలు.
అయితే తాజాగా దీప్తి సునయన, షన్ముఖ్ కు బ్రేకప్ చెప్పెసింది. ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది దీప్తి. అయితే ఈ నిర్ణయం వాళ్లిద్దరి ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరు విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు.
అయితే ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్ముఖ్ మధ్య రిలేషన్ ఏర్పడినట్లు అందరూ అనుకుంటున్నారు. ఇద్దరూ కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే హద్దులు దాటేస్తూ.. కిస్సింగ్ లు, హగ్గింగులు ఇచ్చుకోవడాలు, ఒకే బెడ్ పై పడుకోవడం చూసి చాలా మంది ఇదేంటని అనుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారమే దీప్తి – షన్నూల మధ్య దూరాన్ని పెంచాయి. అయితే దీప్తి లాంటి వాళ్లకు ముందుగానే బిగ్ బాస్ అనుభవాలు ఉన్నాయి.
గేమ్ కోసం ఇద్దరిని బిగ్ బాస్ దగ్గర చేశాడని ముందుగా దీప్తి అనుకున్నప్పటికీ.. ఇటీవల బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షన్నూ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షన్నూ దీప్తిని కలిసే ప్రయత్నం చేయలేదు. నేరుగా వైజాగ్ లో అతని సొంతింటికి వెళ్లిపోయాడని తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల నుంచి వేయిట్ చేస్తున్న దీప్తి షన్నూతో విసిగిపోయి బ్రేకప్ ప్రకటించిందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీహాన్- సిరిల మధ్య రిలేషన్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కూడా బిగ్ బాస్ అనంతరం పెద్దగా కలిసింది లేదు. అయితే ఇటు దీప్తితో షన్నూ విడిపోవడం, అటు సిరితో శ్రీహాన్ దూరంగా ఉండటం చూస్తే.. ఇక షన్నూ- సిరికి మధ్య ఎవరూ అడ్డంకిగా లేరని నెటిజెన్లు అనుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…