Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరోలకు తమ్ముడి పాత్రలలో నటించి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నారు యంగ్ హీరో శర్వానంద్.ఈయన హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు.
యంగ్ హీరో అడివి శేష్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ తాను నటించిన జాను సినిమా షూటింగ్ నిమిత్తం ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా తాను 15000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానం నుంచి కింద పడిపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాట చిత్రీకరణలో భాగంగా తాను స్కై డైవింగ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం తాను శిక్షణ కూడా తీసుకున్నానని తెలిపారు.15,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకగానే ఒక్కసారిగా పారాషూట్ ఓపెన్ కాలేదని దాంతో దాని కింద పడిపోయానని శర్వానంద్ తెలిపారు. ఇలా అంత ఎత్తు నుంచి కింద పడటంతో తనకు బాగా దెబ్బలు తగిలాయని వెల్లడించారు.
విమానంలో నుంచి కింద పడగానే చేతికి రెండు ప్లేట్లు వేసి 24నట్లు బిగించారని అలాగే కాలికి కూడా ఒక ప్లేట్ వేశారు అంటూ అప్పుడు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఇలా ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవడానికి సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సమయం పట్టిందనీ ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…