హైదరాబాద్: సినీనటుడు రాజీవ్ కనకాలకు పెద్ద షాక్ తగిలింది. ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వివాదంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరో కీలక వ్యక్తిగా ఉన్న సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల క్రితం రాజీవ్ కనకాల తనకు చెందిన ఓ ఫ్లాట్ను విజయ్ చౌదరికి అమ్మారు. అనంతరం విజయ్, అదే ఫ్లాట్ను రూ.70 లక్షలకు శ్రవణ్ రెడ్డి అనే మరో వ్యక్తికి విక్రయించారు.
అయితే కొంతకాలం తర్వాత శ్రవణ్ రెడ్డి ఆ ఫ్లాట్ను చూసేందుకు వెళ్లగా, అక్కడ ఆ ఫ్లాట్ అసలు లేకుండా మొత్తం ఆనవాళ్లు తొలగించబడినట్లు గమనించారు. దాంతో షాక్కు గురైన ఆయన వెంటనే విజయ్ చౌదరిని సంప్రదించగా, ‘‘ఫ్లాట్ ఇచ్చేది లేదు… ఇప్పుడు ఇది వివాదాస్పద అంశం, అవసరమైతే కూర్చొని మాట్లాడుకుందాం’’ అంటూ జవాబిచ్చారు. దీంతో పాటు గత ఏడాది నుండి విజయ్ చౌదరి తనను బెదిరిస్తున్నారని, ఫ్లాట్ ఇవ్వకపోగా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని శ్రవణ్ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించి, నిర్మాత విజయ్ చౌదరిపై మోసానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా, ఆ ఫ్లాట్ను ప్రాథమికంగా విక్రయించిన రాజీవ్ కనకాలకూ పోలీసులు నోటీసులు పంపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…