హైదరాబాద్: సినీనటుడు రాజీవ్ కనకాలకు పెద్ద షాక్ తగిలింది. ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వివాదంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరో కీలక వ్యక్తిగా ఉన్న సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల క్రితం రాజీవ్ కనకాల తనకు చెందిన ఓ ఫ్లాట్ను విజయ్ చౌదరికి అమ్మారు. అనంతరం విజయ్, అదే ఫ్లాట్ను రూ.70 లక్షలకు శ్రవణ్ రెడ్డి అనే మరో వ్యక్తికి విక్రయించారు.
అయితే కొంతకాలం తర్వాత శ్రవణ్ రెడ్డి ఆ ఫ్లాట్ను చూసేందుకు వెళ్లగా, అక్కడ ఆ ఫ్లాట్ అసలు లేకుండా మొత్తం ఆనవాళ్లు తొలగించబడినట్లు గమనించారు. దాంతో షాక్కు గురైన ఆయన వెంటనే విజయ్ చౌదరిని సంప్రదించగా, ‘‘ఫ్లాట్ ఇచ్చేది లేదు… ఇప్పుడు ఇది వివాదాస్పద అంశం, అవసరమైతే కూర్చొని మాట్లాడుకుందాం’’ అంటూ జవాబిచ్చారు. దీంతో పాటు గత ఏడాది నుండి విజయ్ చౌదరి తనను బెదిరిస్తున్నారని, ఫ్లాట్ ఇవ్వకపోగా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని శ్రవణ్ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించి, నిర్మాత విజయ్ చౌదరిపై మోసానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా, ఆ ఫ్లాట్ను ప్రాథమికంగా విక్రయించిన రాజీవ్ కనకాలకూ పోలీసులు నోటీసులు పంపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…