హైదరాబాద్: సినీనటుడు రాజీవ్ కనకాలకు పెద్ద షాక్ తగిలింది. ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వివాదంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరో కీలక వ్యక్తిగా ఉన్న సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల క్రితం రాజీవ్ కనకాల తనకు చెందిన ఓ ఫ్లాట్ను విజయ్ చౌదరికి అమ్మారు. అనంతరం విజయ్, అదే ఫ్లాట్ను రూ.70 లక్షలకు శ్రవణ్ రెడ్డి అనే మరో వ్యక్తికి విక్రయించారు.
అయితే కొంతకాలం తర్వాత శ్రవణ్ రెడ్డి ఆ ఫ్లాట్ను చూసేందుకు వెళ్లగా, అక్కడ ఆ ఫ్లాట్ అసలు లేకుండా మొత్తం ఆనవాళ్లు తొలగించబడినట్లు గమనించారు. దాంతో షాక్కు గురైన ఆయన వెంటనే విజయ్ చౌదరిని సంప్రదించగా, ‘‘ఫ్లాట్ ఇచ్చేది లేదు… ఇప్పుడు ఇది వివాదాస్పద అంశం, అవసరమైతే కూర్చొని మాట్లాడుకుందాం’’ అంటూ జవాబిచ్చారు. దీంతో పాటు గత ఏడాది నుండి విజయ్ చౌదరి తనను బెదిరిస్తున్నారని, ఫ్లాట్ ఇవ్వకపోగా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని శ్రవణ్ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించి, నిర్మాత విజయ్ చౌదరిపై మోసానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా, ఆ ఫ్లాట్ను ప్రాథమికంగా విక్రయించిన రాజీవ్ కనకాలకూ పోలీసులు నోటీసులు పంపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…