Mahaesh Babu: ప్రముఖ నిర్మాత మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్..! అతడికి అది గుర్తుందో లేదో అంటూ..!
Mahaesh Babu: మహేష్ బాబు ఈ పేరు వింటేనే చాలా మంది మదిలో వైబ్రేషన్స్ మోగుతుంటాయి. టాలీవుడ్ కలల రాకుమారుడిగా అమ్మాయిల మనస్సులను కొల్లగొట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ దాకా ఎదిగాడు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. నాలుగేళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.
బాల నటుడిగానే 9 సినిమాల్లో నటించాడు. అప్పుడే.. మహేష్ బాబుకు ఎనలేని క్రేజ్ ఉండేది. అయితే చదువు పాడుకాకూడదనే ఉద్దేశ్యంతో కృష్ణ, మహేష్ బాబును కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంచారు. అయితే కృష్ణ మహేష్ బాబు కన్నా తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా చేద్దాం అని అనుకున్నాడు కానీ.. రమేష్ బాబుకు అనుకున్నంత ఆదరణ రాలేదు.
అయితే మహేష్ బాబును ’రాజకుమారుడు‘ గా తొలిసారిగా హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఆ సమయంలో నాలుగైదు సినిమాల వరకు కృష్ణగారే స్టోరీలను విని ఫైనలైజ్ చేసేవారట. ఆ తరువాత నుంచి మహేష్ బాబే స్వయంగా స్టోరీలను విని ఒప్పుకొవడం మొదలు పెట్టారని ఓ నిర్మాత చెప్పుకొచ్చారు.
రాశీ మూవీస్ అధినేత సీనియర్ నిర్మాత నరసింహ రావు.. మహేష్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మహేష్ బాల నటుడిగా ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆటైంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నానని.. ఆసమయంలో ఆయన శోభన్ బాబుతో వేరే సినిమా చేస్తుండటంతో వేరే వారి దర్శకత్వంలో గూడాచారి 117 కృష్ణ గారితో చేశానన్నారు.
ఆ మూవీలో బాల నటుడిగా మహేష్ బాబు కూడా నటించాడని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు సైకిల్ పై తిరిగే సమయంలోనే ఆయనకు నేను రూ. 500 అడ్వాన్స్ గా ఇచ్చానని.. మీ డేట్లు కావాలని అడిగానన్నారు. అయితే డేట్స్ అంటే ఏమిటని మహేష్ నన్ను ప్రశ్నించారని నిర్మాత నరసింహ రావు గుర్తు చేసుకున్నారు. మహేష్ స్టార్ అయ్యాక ఓసారి కలిశామని.. మంచి సబ్జెక్ట్ ఉంటే తీసుకురమ్మని సినిమా చేద్దాం అన్నారని ఆయన వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…