Sarkaru Vaari Paata: పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యింది. మొదటి షో తోనే మిశ్రమ స్పందన లభించిన కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది అంటూ మేకర్స్ కూడా వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ 100కోట్ల పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్టర్ పై స్పందిస్తూ మిశ్రమ స్పందన లభించిన ఈ సినిమా వంద కోట్లు రాబట్టడం ఎంత వరకు నిజం? ఈ పోస్టర్ లో నిజం ఎంత ఉంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో $2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పలుచోట్ల కలెక్షన్లు మంచిగానే ఉన్నప్పటికీ ఏకంగా వంద కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు ఈ పోస్టర్ పై స్పందిస్తూ ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ఉన్న పోస్టర్లను విడుదల చేస్తూ మహేష్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు సినిమా యావరేజ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారు. సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఒకే సారి ఇలా 100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా…
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన ఒక విచిత్ర ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి బంధం మొదలైన తొలి రాత్రే భారీ…
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికు భక్తులు పెద్దఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన…