బుల్లితెర ప్రసారమయ్యే రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈక్రమంలోనే తెలుగు మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అప్పట్లో అధిక రేటింగ్స్ సంపాదించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అలాగే మొదటి సీజన్ విజయవంతం కావడంతో రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా కొనసాగీ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించి ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది.
ఇక సీజన్ 3 నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన అటువంటి సీజన్-3, 4 ఎంతో విజయవంతమయ్యాయి అత్యధిక రేటింగ్స్ ను సాధించాయి. ఇలా నాలుగవ సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులు ఐదవ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమయింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా ఒకేసారి 19 మందిని హౌస్ లోకి పంపించారు. సీజన్ ఫైవ్ గత సీజన్లతో పోలిస్తే ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయబోతున్నారని చెప్పినప్పటికీ ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరుస్తోందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ప్రేక్షకులను సందడి చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే రేటింగ్స్ కూడా అమాంతం పడిపోయాయి. ఇక వారాంతంలో నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడినప్పటికీ వారిని అడగాల్సిన ప్రశ్నలు తప్ప ఇతర ప్రశ్నలు వేస్తూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులకు మాత్రం ఎలాంటి కిక్ ఇవ్వలేదని ఈ కార్యక్రమం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మరి మిగతా వారాలలో అయినా బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తారో లేకపోతే ఇలాగే కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…