ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో విజయ పథంలో దూసుకుపోతున్న శ్రియ కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీ దూరమైనప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే శ్రియ సంజన రావు దర్శకత్వంలో క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించిన గమనం చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ఇందులో ప్రియాంక జవాల్కర్ నిత్యామీనన్, శివ కందుకూరి కూడా కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా చూడటానికి ఒక సాధారణ వ్యక్తిలా ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఆటోలో మల్లికార్జున థియేటర్ కి ఆటోలో ప్రయాణం చేసి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా వీక్షించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు శ్రియ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలా సాధారణ వ్యక్తిలా సినిమాకు ఆటోలు వెళ్లడం పట్ల అందరూ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గమనం సినిమాలో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఇక ఈమె నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…