నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ దక్కించుకుంది.ఇక ఈ సినిమా ద్వారా నటుడు శ్రీకాంత్ వరదరాజులు అనే విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుని దూసుకుపోతోంది.
ఈ సినిమా విజయం సాధించడంతో వైజాగ్ లో సినిమా విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భాగంగా శ్రీకాంత్ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ తో నాకు చాలా అనుబంధం ఉందని నా మొదటి సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాము అలాగే అఖండ సినిమా విజయోత్సవ వేడుకను ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
బోయపాటి దర్శకత్వంలో రెండు సినిమాలు చేశాను బాలయ్యతో కలిసి రెండు సినిమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఆయనతో పని చేస్తున్నంతసేపు మనకు అలుపంటూ ఉండదు బాలకృష్ణ గారు ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తారని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఇక వరదరాజులు పాత్ర నాకన్నా ఆయనకి ఎక్కువ నమ్మకం ఉందని తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఎన్నోసార్లు తెలిపినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.ఇక ఇందులో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారని సాక్షాత్తు శివుడే బాలకృష్ణ రూపంలో ఈ సినిమాలో నటించారా అనేంతగా బాలకృష్ణ పాత్రలో ఒదిగిపోయారని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అఖండ సినిమాకు ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…