నాగ్ అశ్విన్ తదుపరి చిత్రంలో దీపికా పదుకొణె , బాహుబలి స్టార్ ప్రభాస్ మొదటిసారి స్క్రీన్స్పేస్ను పంచుకోనున్నారు. దీనికి తాత్కాలికంగా ‘ప్రాజెక్ట్ కె’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు హైదరాబాద్లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం షూట్ను ప్రారంభించారు.
దీపికా పదుకొణె గతవారం టీమ్లో జాయిన్ అవ్వగా.. ప్రభాస్ ఈరోజు నుంచి షూటింగ్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను రూపొందించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ను గ్రాండ్గా మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు ఈ మెగా ప్రాజెక్ట్ను ప్రకటించిన సందర్భంగా.. నాగ్ అశ్విన్ ఒక ప్రకటనలో ఈ చిత్రం కథ గురించి తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పాడు. దీపిక ఈ పాత్రలో నటించినందుకు తాను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత వరకు దీపిక ఇటువంటి రోల్ చేయలేదని తెలిపారు.
దీపిక, ప్రభాస్ల జోడి ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని అన్నారు. దీనిలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. కొన్ని నెలల క్రితం ఆరంభమైన ఈ చిత్రం షూటింగ్లో అమితాబ్ బచ్చన్ మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునేతో పాటు.. తాజాగా ప్రభాస్ కూడా ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా, డాని శాంచెజ్ లోపెజ్ కెమెరా బాధ్యతలను అప్పగించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…