Karthika Pournami: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే 12 మాసాలు కూడా ఎంతో విశిష్టమైనవి అని చెప్పాలి. అయితే ఇందులో కార్తీక మాసానికి మరింత విశిష్టత ఉంది. కార్తీకమాసం శివ కేశవలకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అందుకే ఈ నెలలో శివ కేశవులను పూజించడం వల్ల వారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతుంటారు.
ఈ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇలా సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది.
ఈ రోజు కనుక మనం దీపారాధన చేయటం వల్ల సంవత్సరంలో మనం ఏ రోజు దీపారాధన చేయకపోయినా ఈరోజు చేసిన పుణ్యఫలం కలుగుతుందని చెప్పాలి.ఈ కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ఆలయాలలోనూ తులసి కోట ముందు కూడా ఇక దీపాలను వెలిగిస్తూ ఆ శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు..ఇలా దీపారాధనకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు మరికొన్ని పనులు చేయటం వల్ల కూడా ఆ శివకేశవుల అనుగ్రహం మన పైనే ఉంటుంది.
దానధర్మాలు చేయాలి..
కార్తీక పౌర్ణమి దీపారాధనకు ఎంత విశిష్టత కలిగి ఉందో దానధర్మాలకు కూడా అంతే విశిష్టత కలిగి ఉంది. అందుకే మనకు తోచిన మేరకు మన ఆర్థిక స్తోమత బట్టి ఇతరులకు దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.
పవిత్రమైన కార్తీక మాసం రోజున చేయాల్సిన మరి కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అనే విషయానికి వస్తే.. దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ. ఇలా పౌర్ణమి రోజు ఈ పనులను చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు చివరకు తుది నిర్ణయానికి వచ్చింది. దాదాపు 18…
నాన్వెజ్ ప్రియులకి చికెన్, మటన్ అనగానే మళ్ళీ తలెత్తే రుచి మాత్రమే కాదు, ఆహార పోషకాల పరంగా కూడా ఎంతో…
దక్షిణ భారత సినీ ప్రపంచాన్ని కుదిపేసే ప్రకటన వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరు లెజెండరీ నటులు రజినీకాంత్ మరియు…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం ఆమె కొత్త…
టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన ప్రేమజంట Vijay Deverakonda – Rashmika Mandanna పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల అంశం మళ్లీ వేడెక్కుతోంది. పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు గత కొంతకాలంగా రాజకీయ వేదికలపై…