Singer B. Vasantha : బొడ్డుపల్లి బాల వసంత అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ బి.వసంత అనగానే సింగర్ గా ఆమె పాడిన అలనాటి పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ తెలుగు లోగిల్లలో వినిపిస్తుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ ఇలాసుమారు 8 భాషలలో సుమారు పదివేలకు పైగా పాటలు పాడిన వసంత గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ అప్పటి రోజుల్లో ఎలా రిలేషన్స్ ఉండేవి లాంటి విషయాలను తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ఒక ఊపు ఊపుతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వసంత గారి సొంత చెల్లి కొడుకు కావడం విశేషం.
థమన్ సంగీతంలో పాడాను… వాడి పాటలు నాకు అర్థం కావు…
వసంత గారు సింగర్ గా పాడుతూ డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించారు. తన చెల్లెళ్ళ పెళ్లిళ్లు జరిగాక తాను చేసుకుని స్థిరపడ్డారు. ఇక ఒక చెల్లి కొడుకైన థమన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తాను సాధించలేకపోయినది కొడుకు సాధిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాలో “బృందావనం అది అందరిది గోవిందుడు అందరివాడేలే” పాటను థమన్ తన చేత పాడించుకున్నాడని అందుకు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చాడని తెలిపారు. ఇక తన మ్యూజిక్ లో వచ్చిన పాటలను తక్కువగా వింటుంటానని చెప్పారు. ఇప్పుడు పాటలు తనకు అర్థం కావని అవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కలిపి ఉండటం వల్ల అర్థం కావంటూ చెప్పారు. అయితే కొన్ని పాటలు బాగానే ఉంటాయని ‘అలా వైకుంఠపురంలో’ని సమాజవరగమనా అనే పాట చాలా బాగుంటుందని చెప్పారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…