టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల పాటలను పాడి తన మధురమైన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న సింగర్ సునీత ఈ ఏడాది మొదట్లో రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రెండవ వివాహం చేసుకున్న తర్వాత సునీత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకునే వారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సునీతకు ఎంతోమంది అభిమానులు అయ్యారు.
రెండవ వివాహం తర్వాత ఇటు కుటుంబ పరంగా అటు వృత్తి పరంగా ఎంతో బిజీగా మారిన సునీత తాజాగా తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. సునీత భర్త రామ్ మ్యాంగో మీడియాతో పాటు మరికొన్ని డిజిటల్ ఛానళ్లకు అధిపతిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తన బిజినెస్ మరింత డెవలప్ చేయడం కోసం తన భార్య సింగర్ సునీతను సహాయం కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీత తన భర్త రామ్ తో కలసి మ్యాంగో బ్యానర్పై వెబ్ సిరీస్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ల బాధ్యత మొత్తం రామ్ సునీతకు అప్పగించినట్లు తెలుస్తోంది. నటీనటులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహించే దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతలను కూడా సునీత తీసుకోనుంది.
ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియాకు ఎంతో డిమాండ్ పెరగడంతో ఈ విధంగా సునీత బిజినెస్ రంగం వైపు అడుగు వేయడం మంచి నిర్ణయం అని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…