Singer Sunitha: దేవుడా… జనాలు ఏంటి ఇలా ఉన్నారు… ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత!
Singer Sunitha:టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శనివారం సునీత సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.సునీత తన ఫాంహౌస్ లో ఉన్నటువంటి మామిడి చెట్టు దగ్గర మామిడిపండ్లని చూపిస్తూ ఒక ఫోటో షేర్ చేశారు.
ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ ఫోటోకి ఈమె బ్లెస్డ్ అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయింది. సునీత ఈ విధంగా మామిడి పండ్లను చూపిస్తూ ఫోటో షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది నెటిజన్లు సునీత తల్లి కాబోతుందనే వార్తను సృష్టించారు.
ఈ క్రమంలోనే ఆమె అభిమానులు నెటిజనులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ వార్త షికార్లు చేయడంతో సునీత ఈ వార్తపై స్పందించి తన గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా సునీత స్పందిస్తూ దేవుడా… జనాలు ఏంటి మరీ ఇంత క్రేజీగా ఉన్నారు.
మామిడి తోటలో మొదటి పంట వచ్చిందని ఆ ఫోటోని షేర్ చేస్తే ఏవేవో ఊహించుకుంటున్నారు.. దయచేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయకండి అయినా మీకో దండం రా నాయనా అంటూ సునీత తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి సునీత చేసిన ఈ పోస్ట్ మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…