బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో కుటుంబ సభ్యులు రావడంతో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి సిరి మదర్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారిగా సిరి తన తల్లిని చూడటంతో పరుగున వెళ్లి తన తల్లిని హత్తుకుని ఎమోషనల్ అయ్యింది.
సిరి మదర్ కూడా సిరిని చూడగానే ఎమోషనల్ అవుతూ ఎంతో అద్భుతంగా ఆడుతున్నావని తన కూతురు పై ప్రశంసలు కురిపించింది.ఇదిలా ఉండగా సిరి గురించి బిగ్ బాస్ హౌస్ లో చెబుతూ కాస్త ఎమోషనల్ అయిన సిరితల్లి అనంతరం సిరికి గట్టిగా బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ్ ను ముద్దులు పెట్టుకోవడం, తనని హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
అయితే ఈ విధంగా వీరిద్దరి వ్యవహారశైలిపై సిరి తల్లి సిరి గట్టిగా బుద్ధి చెప్పింది. కానీ ఈ పని చేయాల్సిన హోస్ట్ నాగార్జున మాత్రం వీరి వ్యవహారశైలి చూస్తూ చూడనట్టు వదిలేశాడు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నాగార్జునను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా సిరి, షణ్ముఖ్ గురించి సిరి తల్లి సిరికి వార్నింగ్ ఇవ్వడంతో మరోసారి నెటిజన్లు నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున చేయలేని పనిని సిరి తల్లి చేసి వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నాగార్జున చేయలేని పనిని సిరి తల్లి చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…