Featured

‘మనసును హత్తుకునే పాటలెన్నో.. మనిషిని కదిలించే భావాలెన్నో’.. ఎవరన్నారు సిరివెన్నెల లేరని..

పాటల పూదోటగా విరిసిని కుసుమం సీతారామ శాస్త్రి.. ఎందరో మహానుభావువులు.. అందరికీ అవందనాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి వేల వేల వందనాలు.. సినిమా ఉన్నంత వరకు సీతారామ శాస్త్రి పాట బతికే ఉంటుంది. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు.. కానీ.. ఆయన పాటలు.. మాధుర్యం అందరి గుండెల్లో బతికే ఉంది. మనసును హత్తుకునే పాటలెన్నో రాశాడు.. మనిషిని కదిలించే పాటలెన్నో రాశారు. అక్షరాలనే ఆయుధాలుగా మార్చేసి, పాటలో పదాలను నిక్షిప్తం చేసి సమాజాన్ని నిగ్గదీసి అడిగాడు. అతడి సాహిత్యం ఆయన పాటలో ప్రవహిస్తుంది. అతడి మృతి పట్ల ‘తెలుగు డెస్క్’ నివాళి అర్పిస్తోంది.

అతడికి అవకాశాలు ఎలా వచ్చాయి.. వాటి గురించి తెలుసుకుందాం.. 1986లో మొదటి సారిగా అవకాశం వచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అందులో అన్ని పాటలు అతడే రాశాడు. అతడి పాటకలు కె.మహదేవన్ సంగీతాన్ని అందించాడు. అందులో ముఖ్యంగా పాపులారిటీ సాధించిన పాట ‘విధాత తలపున ప్రభవించినది’. ఇప్పటికీ ఈ పాట వింటుంటే.. మనస్సులో ఉన్న బాధ అంతా పోయి.. ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మొత్తం ఈ సినిమాలో 9 పాటలు రాశాడు. ఈ సినిమా తర్వాత సిరివెన్నెలకు అవకాశాల కొకొల్లలుగా వచ్చాయి.

అందే సంవత్సరంలో వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్. దీనిలో అతడు గోపీలోలా, ఎక్కడ ఎక్కడ అనే పాటలు రాశాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత శ్రుతిలయలు, స్వయంకృషి వంటి సినిమాలకు పాటలు రాసేందుకు మళ్లీ కె. విశ్వనాథ్ అతడికి అవకాశం కల్పించారు. 1988లో వచ్చిన రుద్రవీణ సినిమాకు ఆరు పాటలు అతడే రాశాడు. అతడు ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’ తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అనే పాట పాడి ముఖ్యమైన పాత్రలో అతడు నటించాడు.

తాను రాసిన పాటకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురం’ సినిమాలో థమన్ సంగీత దర్శకుడిగా ‘సామజవరగమన’ పాటకు పెద్ద ఆదరణ లభించింది. మళ్లీ సిరివెన్నెల ఈజ్ బ్యాక్ అన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 1986 నుంచి మొదలైన అతడి ప్రస్థానం 2021 వరకు సాగింది. తాజాగా అతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాటకు లిరిక్స్ అందించాడు. అతను 2020 వరకు 3000 పాటలకు సాహిత్యాన్ని రచించాడు. 2019లో, కళలు మరియు సౌందర్య రంగానికి చేసిన కృషికి గాను అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది .

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి రోజే విషాదం.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లి తిరిగి రాని వధువు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…

3 hours ago

రిజెక్ట్ చేశారని కుంగిపోకండి.. పూరి జగన్నాథ్ సూపర్ మెసేజ్ వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…

4 hours ago

కేసుతో విసిగిపోయిన జడ్జి.. 2046కి వాయిదా! తర్వాత షాకింగ్ ట్విస్ట్

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…

4 hours ago

కొబ్బరికాయ కుళ్లిపోయింది.. సినిమా ఆగిపోయింది! బాలయ్య మూవీపై సముద్ర షాకింగ్ కామెంట్స్

దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…

4 hours ago

‘హనుమాన్’ మిస్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు పశ్చాత్తాపం!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…

4 hours ago

తల్లి కోసం తండ్రిని చంపిన కుమారుడు.. కడపలో షాకింగ్ ఘటన!

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…

4 hours ago