SK Chandrasekhar: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వరస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న విజయ్ తాజాగా వరీసు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో వారసుడు పేరిట విడుదలైంది.
ఈ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన తమిళంలో మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి విజయ్ గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త వైరల్ గా మారింది ఈయన విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని తేలిపోయింది అలాగే హీరో విజయ్ గత కొంతకాలంగా తన తండ్రితో మాట్లాడటం లేదని ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు తన కుమారుడు విజయ్ కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయన్నమాట వాస్తవమే తాను గత ఏడాదిన్నరగా తన కుమారుడు విజయ్ తో మాట్లాడటం లేదని తెలిపారు. ఇలా మా ఇంట్లో ఇలాంటి గొడవలు జరగడం సర్వసాధారణమైన అని ఇలాంటి అభిప్రాయ భేదాలు రావడం సహజమేనని తెలిపారు.
అయితే వీరిద్దరి మధ్య ఇలాంటి మనస్పర్ధలు రావడానికి గల కారణం కేవలం రాజకీయాలు మాత్రమేనని తెలుస్తుంది.విజయ్ అనుమతి లేకుండా తన తండ్రి బహిరంగ సభను ఏర్పాటు చేసి తన కుమారుడు రాజకీయాలలోకి వస్తున్నాడు అంటూ ప్రకటించారు. అయితే విజయ్ తండ్రి ఇలా చెప్పేసరికి రాజకీయాలలోకి రావడం ఇష్టం లేనటువంటి ఆయన తన తండ్రిపెట్టే పొలిటికల్ మీటింగ్స్ తో తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ వెల్లడించారు దీంతో అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…