తనను కొంతమంది మోసం చేశారంటూ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ పోలీసులకు ఆశ్రయించారు. ఈ మేరకు వాళ్లపై ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో ఎంతో మంది అగ్రహీరోలతో నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
వివాహం తర్వాత ఆమె ఫుల్ హీరోయిన్ గా కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నారు. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది.
అప్పు తీసుకునే సమయంలో వాళ్లు వెంటనే ఇస్తామని చెప్పారని.. కానీ ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని.. ఈ విషయంలో వాళ్లు తనను మోసం చేశారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు వాళ్లు తనపైనే దాడికి దిగారని.. బెదిరింపులకు పాల్పడతున్నారని ఆమె తెలిపింది. అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.
వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు.. ఎలాగైనా వారివద్ద నుంచి డబ్బులు వసూలు చేయించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. సీనియర్ నటి స్నేహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…