విక్టరీ వెంకటేష్ హీరోగా.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం దృశ్యం 2. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం నవంబర్ 25న అమేజాన్ ప్రైమ్లో రాబోతోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో వెంకటేష్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. దృశ్యం1 లో మాదిరిగానే రాంబాబు క్యారెక్టర్ ఉంటుందన్నారు.
అంతకంటే ఎక్కువగా అతడు ఫ్యామిలీ కోసం చేస్తాడు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. ముఖ్యంగా అతడి ఉద్దేశ్యం మాత్రం ఫ్యామిలీని కాపాడుకోవడమే. ఇలాంటి పాత్రలో మళ్లీ నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తన అదృష్టం కొద్దీ సినిమా రంగంలోకి వచ్చాన్నారు. ప్రేక్షకుల అభిమానం దొరికిందని.. నాపై అభిమానం చూపిస్తూనే ఉన్నారు.
వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు. ఇక దృశ్యం 3 వస్తుందా అన్న ప్రశ్నకు స్పందించిన వెంకటేశ్.. ‘మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చన్నారు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయన్న బాధ ఎఫ్3తో పోతుందని తెలిపాడు.
విజయం, అపజయం అనేది ఒకేలా తీసుకోవాలన్నారు. ఇక యంగ్ దర్శకుల నుంచి చాలా కథలు వింటున్నానని.. కానీ ఏ సినిమాకు సంతకం చేయలేదన్నారు. ప్రస్తుతం రానాతో ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ లో చేస్తున్నట్లు చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…