ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏ లక్షణాల ద్వారా కరోనా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంత మందికి తీవ్ర జ్వరం తో పాటు దగ్గు, గొంతు నొప్పి వస్తుంది. ఇలా లక్షణాలు కనిపించిన వెంటనే వారు కోవిడ్ టెస్టు చేయించుకుంటున్నారు.కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే దాని తగ్గట్లు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే నెగెటివ్ రిపోర్టు వచ్చిన వాళ్లకు జ్వరం, దగ్గు తగ్గినా గొంతు నొప్పి అనేది బాధ కలిగిస్తుంటుంది. ఎన్ని చిట్కాలు ఫాలో అయినా దానికి మాత్రం ఉపశమనం కలగదు. అయితే ఇలా గొంతులో గరగర సమస్య ఉటే 5 సింపుల్ టిప్స్ అనుసరించడంతో పూర్తిగా తగ్గుతుంది. అవేంటంటే..
గోరు వెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇలా ఉదయాన్నే ఆ నీటిని తీసుకునే సమయంలో అందులో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో గొంతు నొప్పి మాయమవుతుంది.
మరో చిట్కాలో.. అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేస్తే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా అల్లాన్ని మెత్తగా నూరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే గొంతు నొప్పి పత్తా లేకుండా పోతుంది.
పుదీనా ఆకుల ద్వారా కూడా దీనిని నయం చేయవచ్చు. వాటిని మనం తాగే నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి.. ఆకులు తీసేసి వాటర్ తాగితే మంచిది. చివరి చిట్కా ఏంటంటే.. వేడి నీటిలో కొన్ని చామంతి ఆకుల్ని వేసి మరిగించి.. తర్వాత ఆకులను తీసేసి ఆ నీటిని తాగితే ఇక గొంతులో గరగర అనేది ఉండదు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…