Sobhan Babu:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన నందమూరి తారకరామారావు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఇమిడిపోయే ఈ నటులు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.కేవలం కుటుంబ కథా చిత్రాలు ప్రేమకథా చిత్రాలు మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాలలో కూడా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కూడా క్రమశిక్షణకు మారు పేరు అయితే ఇద్దరిలో ఒక్కటే తేడా ఉంది. ఎన్టీఆర్ నటించిన సినిమా ఏదైనా మంచి హిట్ అయితే ఆ సినిమా రాబట్టిన బడ్జెట్ అనుగుణంగా ఆయన తన తదుపరి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేవారు. ఈ క్రమంలోనే శోభన్ బాబు మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఏడాదికి ఒకసారి తన రెమ్యూనరేషన్ పెంచే వారట.
ఇలా ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావు చేదు జ్ఞాపకాలు అనే పుస్తకంలో రచించారు. ఈ క్రమంలోనే బాబు రమణలు ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని సంపూర్ణ రామాయణం సినిమాని ఎన్టీఆర్ కు వినిపించారట. ఎన్టీఆర్ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో తనకు చెల్లించే రెమ్యూనరేషన్ తో ఈ సినిమా చేస్తామని భావించిన బాపు రమణలు ఈ సినిమాతో కృష్ణంరాజు వద్దకు వెళ్లారు.ఇక కృష్ణంరాజు అదే సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని శోభన్ బాబు దగ్గరికి తీసుకెళ్లారు.
ఇక ఈ సినిమాలో శోభన్ బాబు నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసిన అనంతరం ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకొని చాలా తప్పు చేస్తానని భావించారట అందుకే అప్పటినుంచి తన సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలు చేస్తూ వచ్చారు. ఇకపోతే బాపు రమణ గారి దర్శకత్వంలో చేయాలన్న కోరికతోనే ఈయన శ్రీనాథ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…