Sobhita Dhulipala: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేర్లలో నటి శోభిత పేరు ఒకటి.ఈమె పలు సినిమాలు సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా నటుడు నాగచైతన్యతో రహస్యంగా ప్రేమ ప్రయాణం నడిపిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి లండన్ రెస్టారెంట్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావిస్తున్నారు.
ఇలా తమ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలను నాగచైతన్య లేదా శోభిత కానీ ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే తాజాగా శోభిత సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెహందీ ఫంక్షన్ ఎన్నో కొత్త ముఖాలు ఇప్పుడే ఒకరినొకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా రెడీ అవ్వకుండా నాకు తోడుగా ఉంది.
ఇక నేను తారా కన్నాలా మారిపోయి మెహేంది ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాను. అందుకే ముస్తాబ్ అవ్వడానికి సమయం లేకుండా పోయింది. ఇక పెళ్లి మండపంలో సమంతను పెళ్లికూతురుగా చూసేసరికి తనకు ఏడుపు వచ్చింది.ఇక ఇక్కడ మెహేంది పెట్టడం కుదరలేదు కానీ లంచ్ మాత్రం అద్భుతంగా ఉంది అంటూ పెళ్లి మండపం ఫోటోలను షేర్ చేశారు.
ఇకపోతే సంగీత్ గురించి కూడా ఈమె మరొక పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో తన స్నేహితుల బంధువులతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేసినట్లు ఈమె తెలియజేశారు. ఇలా సంగీత్ ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసినటువంటి నెటిజెన్స్ ఈమె ఏదైనా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారా లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్ళారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఈమె ట్యాగ్ చేసిన సమంత ఎవరా అని ఆరా తీస్తే ఆమె ఒక డాక్టర్ అని తెలుస్తోంది. ఇలా స్నేహితురాలు పెళ్లిలో ఈమె చేసిన సందడి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…