Software employee death mystery : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల మణి రాజ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం ఇండియా వచ్చి స్వస్థలం వరంగల్ కి వచ్చాడు. ఇక హైదరాబాద్ లో పాస్ పోర్ట్ కార్యాలయంలో రెన్యూవల్ కి సంబంధించిన పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి స్నేహితులతో తిరిగిన మణిరాజ్ మరుసటి రోజు ఉదయం స్నేహితుడిని ఇంటిలో బాత్రూంలో శవమై కనిపించాడు.
గుడికి, పబ్ కి వెళ్లిన మణి రాజ్ ఉదయం శవమై…
పాస్ పోర్టు పని కోసం హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ కి మణి రాజ్ తండ్రి నవీన్ డ్రాప్ చేసి వెళ్లగా మణి రాజ్ ఆ పనులను ముగించుకుని స్నేహితులను కలిసి వెస్ట్ మారేడు పల్లి వినాయకుడి గుడికి అలాగే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. ఇక రాత్రి పబ్ కి వెళ్లి ఆలస్యంగా అక్కడే మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20 లో సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న స్నేహితుడు కొత్త చాణక్య అనే వ్యక్తి అపార్టుమెంట్ కి వెళ్ళాడు. ఉదయం అపార్ట్మెంట్ మీటింగ్ కోసమని ఆదివారం నాడు కిందికి వెళ్లిన చాణక్య మణి రాజ్ బాత్రూం వెళ్లిన సంగతి చూడలేదు.
మీటింగ్ అయ్యాక ఉదయం 11:30 సమయంలో ఇంట్లోకి వచ్చి బాత్రూం తలుపు తట్టి చూడగా లోపల నుండి గడిపెట్టుకుని ఉండటంతో ఎంత సేపటికి లోపల నుండి ఎలాంటి శబ్దం రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయంతో తలుపు బద్ధలుకొట్టి చూడగా ఆపస్మారక స్థితిలో మణిరాజ్ కనిపించాడు. వెంటనే 108 కి కాల్ చేసిన చాణక్య హాస్పిటల్ కి తరలించగా అప్పటికే అతను గుండె పోటుతో మరణించినట్లు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన తండ్రి నవీన్ కుమార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతికి అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…