ప్రస్తుత కాలంలో రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఎక్కువైపోయాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులను మోసం చేసి లక్షలకు లక్షలు డబ్బులు దోచుకుంటున్నారు.అయితే సాధారణ వ్యక్తులు లేదా చదువుకోని వారు ఇలాంటి వారి చేతిలో మోసపోయారు అంటే అర్థం ఉంటుంది కానీ.. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే వ్యక్తికి మాత్రం సైబర్ నేరగాళ్లకు గురించి చాలా అవగాహన ఉంటుంది.ఈ విధంగానే ఇంజనీర్ గా పని చేసేటటువంటి ఓ వ్యక్తి తనను ఎవరూ మోసం చేయలేరు అంటూ ఏకంగా 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది.
అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అతని కార్డు వివరాలను అడిగారు. ఈ క్రమంలోనే ఆ ఇంజనీర్ ఈ విషయం గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశారు.ఈ విధంగా వచ్చే ఫోన్ కాల్స్ తో ఎంతో అప్రమత్తంగా ఉండే ఇంజనీర్ చివరికి సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తుగా మోసపోయాడు. తనకు తక్కువ జీతం రావడంతో అతను డబ్బు సంపాదించాలన్న ఆశ పెరిగింది. ఈ క్రమంలోనే కొంత డబ్బులు వ్యాపారంలోకి పెట్టి మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి కేవలం 20 వేల పెట్టుబడితో కొన్ని రోజుల తర్వాత మీరు రూ. 62000 లాభం పొందుతారని చెప్పడంతో ఇంజనీర్ కొంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు అతనికి ఒక లింకు పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే అందులో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ విధంగా వివరాలన్నీ ఉండటంతో ఇంజనీర్ ఇరవై వేలు పెట్టుబడి పెట్టి కొద్దిరోజులకు 62000 లాభం పొందాడు. ఈ విధంగా డబ్బులు రావడంతో అతనికి ఆశ పెరిగింది.
ఈ క్రమంలోనే మరింత డబ్బు సంపాదించాలని భావించిన ఇంజనీర్ ఈ సారి ఏకంగా అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టాడు. ఒకేసారి ఎనిమిది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు.ఈసారి ఎక్కువ డబ్బులను పొందవచ్చని భావించింన ఇంజనీర్ కి అప్లికేషన్ ఫామ్లో విత్ డ్రా బటన్ కనిపించకపోవడంతో అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ రావడంతో అతను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…