Political News

“నా భర్తను ఏదో చేశారు!” లోకేష్ మనుషులు బెదిరించారు.. సింగయ్య మృతిపై భార్య సంచలన ఆరోపణలు!

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన టూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సింగయ్య భార్య లూర్దు మేరి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

“Something was done to my husband!” Wife makes sensational allegations over Singayya’s death!

“నా భర్తను ఏదో చేశారు!”
లూర్దుమేరి మాట్లాడుతూ, “నా భర్తకు పెద్దగా గాయాలు లేవు.. అలాంటప్పుడు ఆయన ఎలా చనిపోతారు?” అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడమే కాకుండా, అంబులెన్సులో ఏదో చేశారని అనిపిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.

లోకేష్ మనుషుల బెదిరింపులు?
సింగయ్య మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, “లోకేష్‌ కు చెందిన యాభై మంది మా ఇంటికి వచ్చారు. మేము చెప్పింది చెప్పారు అని ఒప్పుకోవాలంటూ బెదిరించారు. కాగితాలపై ఏదో రాసి సంతకాలు చేయమన్నారు” అని ఆరోపించారు. ఆమె మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.

జగన్‌ అంటే మాకు ఇష్టం..
తమ కుటుంబం జగన్‌ను మెచ్చుకుంటుందని స్పష్టం చేసిన లూర్దుమేరి, “ఆయన మా కులస్తుల ముద్దు.. అందుకే కలిశాం. ఆయన మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు” అని తెలిపారు. అదే సమయంలో పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. “వీడియో చూపించి సంతకాలు పెట్టమన్నారు” అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ సంఘటన ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. లూర్దుమేరి చేసిన ఆరోపణలపై అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. వాస్తవం ఏదైనా, సింగయ్య మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ రాజకీయ ఆరోపణలు మరింత తీవ్రంగా మారే అవకాశముంది.

telugudesk

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

14 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

15 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

15 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

15 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

15 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

15 hours ago