Sonia Agarwal: ‘డిటెక్టివ్ సత్యభామ’గా సోనియా అగర్వాల్..! సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు..!
Sonia Agarwal: ‘7బై జీ బృందావన్ కాలనీ’లో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన హీరోయిన సోనియా అగర్వాల్ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. మొదట ‘నీ ప్రేమకై’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయి.. 7/జితో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ తర్వత ఆమెకు అంత పెద్దగా పేరు తెచ్చిన సినిమాలు లేవు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ సినిమా ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో సందడి చేయనుంది.
అదేంటంటే.. సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న చిత్రం‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ సందర్భంగా సోనీ అగర్వాల్ మాట్లాడుతూ ‘7బై జీ బృందావన్ కాలనీ’ తర్వాత తనకు ఎక్కువగా పేరు తెచ్చిన సినిమాలు లేవు కానీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ఈ ‘డిటెక్టివ్ సత్యభామ’ అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ముంబైలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ తనకు ముంబాయిలో చూపించారని.. తనకు బాగా నచ్చిందన్నారు.
ఇక ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో ఉండి చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పారు. దీనిలో ప్రతీ జోనర్ వాళ్లకు నచ్చేవిధంగా తీశామని.. అన్ని హంగులతో.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాత శ్రీశైలం తెలిపాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిందని.. యాక్షన్ సీన్లతో కూడా నాలుగు పాటు ఉన్నాయని.. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని దర్శకుడు నవనీత్ చారి అన్నారు. ఈ చిత్రంతోనే తాను దర్శకుడికి పరిచయం అవుతున్నాని కూడా తెలిపాడు. మంచి టెక్నీషియన్స్ టీంతో పనిచేశాం.
సోనియా అగర్వాల్ మా స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్ హీరోయిన్ ఈ కథను సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చని అన్నారు. నిర్మాత ఎప్పుడూ టెన్షన్ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్ చేసి షూటింగ్ సమయానికి అన్నీ అరేంజ్ చేశారన్నారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరమన్నారు. ఈ చిత్రంలో సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…