సింగర్ విజయ లక్ష్మి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతంలో ఎన్నో పాటలు పాడారు. ఆమె గానానికి ఎంతో మంది మంత్ర ముగ్దులయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆశక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా.. సంగీత దర్శకుడు చక్రి గురించి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తనను ఎంతో ప్రోత్సహించారని.. తన ప్రోత్సాహం వల్లే తన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఎవరు సహాయం చేయలేదని అన్నారు.
తన మెరిట్ ప్రకారమే ఇంత వరకు వచ్చానని.. చక్రి మొదట్లో మంచి సాంగ్స్ ఇవ్వకపోయినా.. తర్వాత మంచి సాంగ్స్ తనతో పాడిచ్చారని తెలిపింది. చక్రి ఉండుంటే వేరేలా ఉండేదని.. ఎంతో మంది కొత్త వాళ్లకు చాన్స్ కూడా వచ్చేదని విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త కొత్త వాళ్లను అతడు ఎంకరేజ్ చేసేవాడని తెలిపింది. అతడి జర్నీలో.. అతడితో పాటు ఉన్నవాళ్లు అతడిని చాలా మంది గుర్తు పెట్టుకున్నారన్నారు.
చక్రి సినిమాకు అగ్రిమెంట్ చేయించుకుంటారా అనే ప్రశ్న ఈమెకు ఎదురవగా.. అలాంటిది ఏమి లేదు.. పాట పాడిన దానికి మాత్రమే ఇస్తాడని చెప్పింది. ప్రస్తుతం చాలామంది రూ.లక్ష వరకు తీసుకుంటుంన్నారని చెప్పారు. ఒక సాంగ్ హిట్ అయితే కెరీర్ లో అలా నిలిచిపోతుంది. ఒక్క పాట హిట్ అయితే తర్వాత పాటలకు ఎక్కువ డబ్బులు అడగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
అలా ఆ పాట వల్ల ఎక్కువగా రెమ్యూనరేషన్ పొందొచ్చన్నారు. పాట హిట్ అయితే .. మంచిగా లైఫ్ ఉంటుందని చెప్పారు. దివంగత బాల సుబ్రమణ్యం గారు కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక పాటకు రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వెల్లడించారు. మిగతా వారు దాదాపు రూ.25 నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా సింగర్ విజయ లక్ష్మి తెలిపారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…