సింగర్ విజయ లక్ష్మి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతంలో ఎన్నో పాటలు పాడారు. ఆమె గానానికి ఎంతో మంది మంత్ర ముగ్దులయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆశక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా.. సంగీత దర్శకుడు చక్రి గురించి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తనను ఎంతో ప్రోత్సహించారని.. తన ప్రోత్సాహం వల్లే తన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఎవరు సహాయం చేయలేదని అన్నారు.
తన మెరిట్ ప్రకారమే ఇంత వరకు వచ్చానని.. చక్రి మొదట్లో మంచి సాంగ్స్ ఇవ్వకపోయినా.. తర్వాత మంచి సాంగ్స్ తనతో పాడిచ్చారని తెలిపింది. చక్రి ఉండుంటే వేరేలా ఉండేదని.. ఎంతో మంది కొత్త వాళ్లకు చాన్స్ కూడా వచ్చేదని విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త కొత్త వాళ్లను అతడు ఎంకరేజ్ చేసేవాడని తెలిపింది. అతడి జర్నీలో.. అతడితో పాటు ఉన్నవాళ్లు అతడిని చాలా మంది గుర్తు పెట్టుకున్నారన్నారు.
చక్రి సినిమాకు అగ్రిమెంట్ చేయించుకుంటారా అనే ప్రశ్న ఈమెకు ఎదురవగా.. అలాంటిది ఏమి లేదు.. పాట పాడిన దానికి మాత్రమే ఇస్తాడని చెప్పింది. ప్రస్తుతం చాలామంది రూ.లక్ష వరకు తీసుకుంటుంన్నారని చెప్పారు. ఒక సాంగ్ హిట్ అయితే కెరీర్ లో అలా నిలిచిపోతుంది. ఒక్క పాట హిట్ అయితే తర్వాత పాటలకు ఎక్కువ డబ్బులు అడగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
అలా ఆ పాట వల్ల ఎక్కువగా రెమ్యూనరేషన్ పొందొచ్చన్నారు. పాట హిట్ అయితే .. మంచిగా లైఫ్ ఉంటుందని చెప్పారు. దివంగత బాల సుబ్రమణ్యం గారు కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక పాటకు రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వెల్లడించారు. మిగతా వారు దాదాపు రూ.25 నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా సింగర్ విజయ లక్ష్మి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…