సింగర్ విజయ లక్ష్మి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతంలో ఎన్నో పాటలు పాడారు. ఆమె గానానికి ఎంతో మంది మంత్ర ముగ్దులయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆశక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా.. సంగీత దర్శకుడు చక్రి గురించి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తనను ఎంతో ప్రోత్సహించారని.. తన ప్రోత్సాహం వల్లే తన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఎవరు సహాయం చేయలేదని అన్నారు.
తన మెరిట్ ప్రకారమే ఇంత వరకు వచ్చానని.. చక్రి మొదట్లో మంచి సాంగ్స్ ఇవ్వకపోయినా.. తర్వాత మంచి సాంగ్స్ తనతో పాడిచ్చారని తెలిపింది. చక్రి ఉండుంటే వేరేలా ఉండేదని.. ఎంతో మంది కొత్త వాళ్లకు చాన్స్ కూడా వచ్చేదని విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త కొత్త వాళ్లను అతడు ఎంకరేజ్ చేసేవాడని తెలిపింది. అతడి జర్నీలో.. అతడితో పాటు ఉన్నవాళ్లు అతడిని చాలా మంది గుర్తు పెట్టుకున్నారన్నారు.
చక్రి సినిమాకు అగ్రిమెంట్ చేయించుకుంటారా అనే ప్రశ్న ఈమెకు ఎదురవగా.. అలాంటిది ఏమి లేదు.. పాట పాడిన దానికి మాత్రమే ఇస్తాడని చెప్పింది. ప్రస్తుతం చాలామంది రూ.లక్ష వరకు తీసుకుంటుంన్నారని చెప్పారు. ఒక సాంగ్ హిట్ అయితే కెరీర్ లో అలా నిలిచిపోతుంది. ఒక్క పాట హిట్ అయితే తర్వాత పాటలకు ఎక్కువ డబ్బులు అడగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
అలా ఆ పాట వల్ల ఎక్కువగా రెమ్యూనరేషన్ పొందొచ్చన్నారు. పాట హిట్ అయితే .. మంచిగా లైఫ్ ఉంటుందని చెప్పారు. దివంగత బాల సుబ్రమణ్యం గారు కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక పాటకు రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వెల్లడించారు. మిగతా వారు దాదాపు రూ.25 నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా సింగర్ విజయ లక్ష్మి తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…