అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య ఏమి నడుస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. విడాకుల విషయమై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. వాటిపై వారిద్దరిలో ఒక్కరూ కూడా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో విచిత్రమైన, విభిన్నమైన పోస్టులు పెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోవడం లేదు.
రోజు రోజుకూ రూమర్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల నాగచైతన్య ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత విషయాలను అడగొద్దని కండీషన్ కూడా పెట్టారు. దీంతో అనుమానాలకు ఇంకా బలం చేకూరినట్లు అయింది. ఇటీవల అలాంటి రూమర్స్ ను నమ్మను అని.. తన తల్లిదండ్రులు ఇలాగే పెంచారని చెప్పిన నాగచైతన్య అంతలోనే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అభిమానుల్లోనే గందరగోళ పరిస్థితి ఉండగా.. అటు సినీ పరిశ్రమలో కూడా వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇదిలా ఉండగా.. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకునేందుకు సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నారంటూ తెలుస్తోంది.
ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సమంత తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల దేవస్థానం వద్ద కూడా ఓ రిపోర్టర్ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న అడిగితే.. గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి బుద్ది ఉందా అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలు ఇక మీడియాలో రాకుండా ఏం చేయాలనే సలహాలు తన లీగల్ టీం సభ్యుల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…