ఎస్.పి.శైలజ మనిషి ఎంత సుమధురమో మనసంత మధురం చీరలో నిండైన తెలుగుదనం గొంతులో మెండైన కోకిల గానం. తెరపై నటులు ఆడే ఆటకు తన పాటతో పల్లవి చరణాలనందించి అదే తెరపై తన గొంతుతో ఆయా పాత్రలకు ప్రాణం పోసింది. సినిమా అవకాశాల కోసం ఏనాడు వెంపర్లాడలేదు. తొమ్మిదో తరగతిలో శైలజ పాటలు విన్న సంగీత దర్శకుడు చక్రవర్తి తను సంగీత దర్శకత్వం వహించే సినిమాలో అవకాశం కల్పించారు. 1977 ప్రాంతంలో తన కెరీర్ ప్రారంభించిన శైలజ ఒకటి తర్వాత మరొకటి అన్నట్టుగా అనేక పాటలు పాడారు. ఒకానొక సందర్భంలో బాలసుబ్రమణ్యం కచేరీకి ఫిమేల్ సింగర్ రాకపోవడంతో శైలజతో పాడించడం జరిగింది. అలా ఎస్.పి శైలజ సినీ గమనం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న క్రమంలో అనుకోకుండా ఆమెకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
“సాగరసంగమం” కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించాడు. ఇందులో కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు. కథానాయికగా ముందుగా జయసుధను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృత్యం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్. అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్.పి.శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు.
అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు. శంకరాభరణంతో పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్ళి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది.
మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు.. శైలజ నృత్య ప్రదర్శనలో “పంచభూతములు ముఖపంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై.. అనే గాన లాహిరిలో పంచభూతాలు అనగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అని తెలియకుండా భూతము, దెయ్యం అన్నట్టుగా ఆంగిక ప్రదర్శన జరిగిందని శైలజ గురించి ఓ దినపత్రికలో బాలకృష్ణ(కమల్ హాసన్) రాస్తాడు.. అది చదివిన శైలజ ప్రియుడు.. ఆ దినపత్రిక కార్యాలయం లో బాలకృష్ణను నానా మాటలు అంటూ దూషిస్తాడు… ఆవేశంతో బాలకృష్ణ (కమల్ హాసన్) ఆ పాటకు నృత్యం ఎలా చేయాలో.. భరతనాట్యం, కథక్, కథాకళి నృత్యాలను చేసి ఆమెకు (శైలజ) చూపిస్తాడు.
గత నృత్య ప్రదర్శనలో శైలజ చేసిన తప్పు ఏంటో సంపూర్ణంగా తెలుసుకుంటుంది. ఆ తరువాత నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు, తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పోంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ(కమల్ హాసన్) మరణించడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో “సలంగై ఒలి” (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది. ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…