Sp Shailaja: సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్నటువంటి వారిలో సింగర్ శైలజ ఒకరు. ఈమె స్వయంగా దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వయానా చెల్లెలు.
ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్పీ శైలజ కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలజ తన కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. తన కుటుంబంలో అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మాత్రమే సింగర్ అనీ మిగతా వారందరూ కూడా సంగీత వాయిద్యాలను వాయించే వారేనని తెలిపారు. అయితే తాను సింగర్ అవుతానని ఎవరు ఊహించుకోలేదు. కానీ తాను సింగర్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డానని తెలిపారు.
ఇకపోతే ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా ఒక సినిమాలో నటించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం సినిమాలో ఈమె నటించారు.అయితే ఇందులో ఓ సన్నివేశంలో భాగంగా తాను కమల్ హాసన్ గారిని కాలితో తన్నాల్సి వచ్చింది.అయితే ఈ సన్నివేశం చేయడానికి తాను ఎన్నిసార్లు కాళ్లు లేపిన తన కాలు వెనక్కి వచ్చేదని శైలజ తెలిపారు.ఇక డైరెక్టర్ గారు నువ్వు చేస్తున్నది కేవలం ఒక పాత్ర మాత్రమే అంటూ తనకు వివరణ ఇవ్వడంతో అప్పుడు కమల్ హాసన్ గారిని కాలితో తన్నానని ఈ సందర్భంగా అప్పటి సంఘటనను శైలజ గుర్తు చేసుకున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…