Featured

Sree Lakshmi : ఇద్దరు పిల్లలు చనిపోయారు… వాడి జీవితం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు : శ్రీ లక్ష్మి

Sree Lakshmi : సీనియర్ నటి, కమెడియన్ శ్రీలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె కొన్నివందల సినిమాల్లో నటించారు. శ్రీ లక్ష్మి గారి తండ్రి అమర్నాథ్ గారు తెలుగులో హీరోగా ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను చేశారు. ఇక శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్ కూడా నటుడే. తెలుగు సినిమాల్లో చేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో గా అలాగే విలన్ గా పాత్రలు చేసిన రాజేష్ గారు చాలా చిన్న వయసులో మరణించారు. ఇక ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక రాజేష్ గారి మరణం గురించి శ్రీలక్ష్మి గారు తాజాగా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.

అలా చనిపోతాడని కలలో కూడా అనుకోలేదు…

రాజేష్ చిన్న వయసులోనే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ శ్రీ లక్ష్మి గారు అభిప్రాయపడ్డారు. మా నాన్న ఆరోగ్యం బాగోలేక ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాల్లో ఉన్న అవకాశాలను కూడా వదలకుండా సినిమాలను చేసాను. ఇక అలా రాజేష్ నేను సినిమాలను చేస్తున్న సమయంలో తండ్రి మరణించాక కొద్దిరోజులకే రాజేష్ పెళ్లి చేసుకోవాలానే నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి ఈ వయసుకే పెళ్లి ఎందుకు ఇంకా ఆడపిల్లలం మేమే పెళ్లి చేసుకోలేదు అని అన్నా వినలేదు అంటూ శ్రీలక్ష్మి గారు బాధపడ్డారు. ఇక పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాడు ముప్పై ఏడేళ్లు దాటేసరికి నలుగురు పిల్లలు కుటుంబం బాధ్యతలతో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పని బాధపడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తాగి చిన్న వయసులో ముప్పై ఎనిమిదేళ్ళకే మరణించాడు. అంత చిన్న వయసుకే తప్పుడు నిర్ణయాల వల్ల మరణించాడు.

ఇక పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఇరవై ఏళ్ళు వచ్చాక మరణించారు. ఒకడు ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడని ఫోన్ చేసి ఆ అమ్మాయి కుటుంబం చెప్పారు. వెళ్లే సరికి హాస్పిటల్ లో శవం ఉంది, ఏం జరిగిందో ఎలా చనిపోయాడో ఇప్పటికీ తెలీదు. ఇక ఇంకొకడు అచ్చం రాజేష్ లాగా ఉండేవాడు వాడు ఆక్సిడెంట్ లో డివైడర్ కొట్టి చనిపోయాడు. అలా రాజేష్ ఇద్దరు పిల్లలు పెద్దయ్యాక మరణించారు అంటూ శ్రీ లక్ష్మి చెప్పారు. ఇక కూతురు ఐశ్వర్య మాత్రం ప్రస్తుతం తమిళ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago