Sree Lakshmi : సీనియర్ నటి, కమెడియన్ శ్రీలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె కొన్నివందల సినిమాల్లో నటించారు. శ్రీ లక్ష్మి గారి తండ్రి అమర్నాథ్ గారు తెలుగులో హీరోగా ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను చేశారు. ఇక శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్ కూడా నటుడే. తెలుగు సినిమాల్లో చేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో గా అలాగే విలన్ గా పాత్రలు చేసిన రాజేష్ గారు చాలా చిన్న వయసులో మరణించారు. ఇక ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక రాజేష్ గారి మరణం గురించి శ్రీలక్ష్మి గారు తాజాగా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.
అలా చనిపోతాడని కలలో కూడా అనుకోలేదు…
రాజేష్ చిన్న వయసులోనే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ శ్రీ లక్ష్మి గారు అభిప్రాయపడ్డారు. మా నాన్న ఆరోగ్యం బాగోలేక ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాల్లో ఉన్న అవకాశాలను కూడా వదలకుండా సినిమాలను చేసాను. ఇక అలా రాజేష్ నేను సినిమాలను చేస్తున్న సమయంలో తండ్రి మరణించాక కొద్దిరోజులకే రాజేష్ పెళ్లి చేసుకోవాలానే నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి ఈ వయసుకే పెళ్లి ఎందుకు ఇంకా ఆడపిల్లలం మేమే పెళ్లి చేసుకోలేదు అని అన్నా వినలేదు అంటూ శ్రీలక్ష్మి గారు బాధపడ్డారు. ఇక పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాడు ముప్పై ఏడేళ్లు దాటేసరికి నలుగురు పిల్లలు కుటుంబం బాధ్యతలతో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పని బాధపడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తాగి చిన్న వయసులో ముప్పై ఎనిమిదేళ్ళకే మరణించాడు. అంత చిన్న వయసుకే తప్పుడు నిర్ణయాల వల్ల మరణించాడు.
ఇక పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఇరవై ఏళ్ళు వచ్చాక మరణించారు. ఒకడు ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడని ఫోన్ చేసి ఆ అమ్మాయి కుటుంబం చెప్పారు. వెళ్లే సరికి హాస్పిటల్ లో శవం ఉంది, ఏం జరిగిందో ఎలా చనిపోయాడో ఇప్పటికీ తెలీదు. ఇక ఇంకొకడు అచ్చం రాజేష్ లాగా ఉండేవాడు వాడు ఆక్సిడెంట్ లో డివైడర్ కొట్టి చనిపోయాడు. అలా రాజేష్ ఇద్దరు పిల్లలు పెద్దయ్యాక మరణించారు అంటూ శ్రీ లక్ష్మి చెప్పారు. ఇక కూతురు ఐశ్వర్య మాత్రం ప్రస్తుతం తమిళ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…